Covid-19: వెనక్కి తగ్గేదేలే.. చైనాపై ఒత్తిడి పెంచిన డబ్ల్యూహెచ్వో
కరోనా వైరస్ మహమ్మారి మూలాల నిర్ధారణకు చైనా కచ్చితంగా సహకరించాలని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెండ్రోస్ అన్నారు.
జెనీవా: కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రెయెసస్ పునరుద్ఘాటించారు. వైద్యనిపుణుల బృందాన్ని అక్కడికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వూహాన్ ల్యాబ్ (Wuhan Lab) నుంచే కొవిడ్-19 వైరస్ బయటకొచ్చిందని ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో నిజనిర్ధారణకు పూర్తి సహకారం అందించాలని చైనాను మరోసారి కోరినట్లు ఓ అంతర్జాతీయ మీడియాకు ఆయన తెలిపారు. చైనాతో ద్వైపాక్షిక సమావేశాల్లోనూ ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని చర్చకు తీసుకురావాలని ఆయన కోరారు. వూహాన్ ల్యాబ్లో పరిశోధనలకు అనుమతిస్తే, డబ్ల్యూహెచ్వో నుంచి బృందాన్ని పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనాకి ఇప్పటికే లేఖ రాసినట్లు ఆయన గుర్తు చేశారు.
యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు. 2019 చివరిలో చైనాలోని వూహాన్ నగరంలో తొలి కేసు నమోదైంది. దీనిపై రెండు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వూహాన్లో వైరస్లపై పరిశోధన చేసే ల్యాబొరేటరీ నుంచే కొవిడ్-19 వైరస్ బయటకొచ్చిందని కొందరు చెబుతుంటే.. కొవిడ్ సోకిన జంతువు నుంచి మానవులకు వ్యాప్తి చెంది ఉండొచ్చని మరొక వాదన ఉంది. దీనిపై 2021లో డబ్ల్యూహెచ్వో ఓ నిజనిర్ధారణ కమిటీని వేసింది. చైనా వైద్య బృందంతో కలిసి పరిశోధనలు చేసిన ఆ కమిటీ.. ఉమ్మడి నివేదికను వెల్లడించింది. వూహాన్ మార్కెట్లో ఓ గబ్బిలం నుంచి ఈ వైరస్ మానవులకు సోకి ఉండొచ్చని చెప్పింది. మిగతా వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.
దీనిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో నిజనిర్ధారణకు కేవలం డబ్ల్యూహెచ్వో బృందాన్ని మాత్రమే అనుమతించాలని డబ్ల్యూహెచ్వో పలుమార్లు కోరింది. దీనికి చైనా ఏమాత్రం అంగీకరించడం లేదు. అయినప్పటికీ, తమ దర్యాప్తును విరమించే ప్రసక్తే లేదని డబ్ల్యూహెచ్వో చీఫ్ చెబుతున్నారు. వైరస్ మూలాలపై కచ్చితంగా సమాచారం తెలుసుకుంటామని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. అమెరికా లాంటి అగ్రదేశాల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ వూహాన్ ల్యాబ్లో వైరస్ పుట్టుకపై నిజనిర్ధారణ చేసేందుకు చైనా నుంచి ఏమాత్రం మద్దతు లభించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్