WHO: ఆల్కహాల్, తీపిపానియాల వాడకాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్వో కొత్త సిఫార్సు
ఆల్కహాల్, తీపి పదార్థాల వాడకాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంఖ్య కొత్త సిఫార్సు చేసింది. వీటి ఉత్పత్తులపై అధిక పన్నును విధించాలని ఒక మాన్యువల్ను విడుదల చేసింది.
జెనీవా: మారుతున్న జీవనశైలితోపాటు, ఆహారపు ఆలవాట్లతో మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. మద్యపానం(Alcohol), తీపి పానియాల(Sugar Swetened beverages) అలవాటుతో చిన్న వయసులోనే పలువురు రోగాల బారిన పడుతున్నారు. వీటి ప్రభావం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలు మానవాళి ఆరోగ్య సంరక్షణకు ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ అనుకున్న రీతిలో ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో వీటి కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) భిన్న మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఆల్కహాల్, తీపి పానియాలపై వాడకంపై ఎక్సైజ్ పన్ను(Exice Tax)ను మరింత ఎక్కువ విధించాలని డబ్ల్యూహెచ్వో తాజాగా సిఫార్సు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆల్కహాల్, షుగర్ బేవరేజెస్పై తక్కువ సుంకాన్ని విధిస్తున్నాయని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. పలు దేశాల్లో వీటిపై విధిస్తున్న పన్నును పరిశీలించగా చాలా దేశాల్లో తక్కువ విధిస్తున్నారని తమ పరిశోధనలో తేలిందని తెలిపింది. ఆరోగ్య మానవాళిని పెంచేందుకు ఆల్కహాల్, తీపిపానియాలపై ఎక్కువ పన్ను వేయడం మెరుగైన ప్రభావం చూపుతుందని పేర్కొంది.
దీనికి సంబంధించి తాజాగా డబ్ల్యూహెచ్వో ఆల్కహాల్ ట్యాక్స్ పాలసీ మాన్యువల్(alcohol Tax policy)ను విడుదల చేసింది. అధిక పన్నుల(Tax) వల్ల లిక్కర్ వాడకాన్ని అరికట్టవచ్చని, తద్వారా ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలను అదుపులో పెట్టవచ్చని పేర్కొంది. మద్యం విపరీతంగా తాగే అలవాటు ఉన్నవారు మార్కెట్లో తక్కువ ధరకు దొరికే దానినే ఎంచుకుంటారని ఒక పరిశోధనలో తేలినట్లు పేర్కొంది. మద్యం వాడకం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది, అనారోగ్య ఆహార పదార్థాల వల్ల ఏటా 8 లక్షల మంది చనిపోతున్నారని తెలిపింది. ఆల్కహాల్, తీపిపానియాలపై ఇప్పుడు విధిస్తున్న సుంకానికి అధనంగా ఎక్కువ మొత్తంలో పన్ను వేయడం వల్ల గణనీయసంఖ్యలో మరణాలను ఆపవచ్చని పేర్కొంది. ఇలా చేయడం వల్ల హానికర ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులను పెంచేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. తీపిపానియాలపై ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో పన్ను ఉన్నప్పటికీ ఆ ఉత్పత్తిలో సగటున పన్ను 6.6 శాతం ఉంటున్నట్లు తెలిపింది. అనారోగ్యానికి గురిచేసే ఉత్పత్తులపై టాక్స్ విధించడం వల్ల అరోగ్యకర జనాభా పెరుగుతుంది. ఇది మన సమాజంపై ఒక సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తుంది. తద్వారా వ్యాధులు తగ్గడానికి, ప్రభుత్వాలకు ఆదాయం పెరిగి మరింత సేవ చేసేందుకు ఉపయోగపడుతుంది’’ అని డబ్ల్యూహెచ్వో హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్ రుడిగర్ క్రెచ్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 148 దేశాలు ఆల్కహాల్ ఉత్పత్తులపై ఒక్కోరకంగా పన్నులు విధిస్తున్నాయని, అయితే వీటిలో 22 దేశాలు వైన్పై విధించడం లేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అమ్ముడు పోయే ఆల్కహాల్ కలిగిన బీర్లపై సగటున 17.2 శాతం, స్పిరిట్ ఉత్పత్తులపై 26.5 శాతం పన్ను విధిస్తున్నట్లు తేలినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఆల్కహాల్ బేవరేజెస్ చాలా సరసమైన ధరలో దొరుకుతుండటంపై డబ్ల్యూహెచ్వో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఐలాన్ లీ ఆందోళన వ్యక్తం చేశారు. మద్యంపై అధిక పన్నులు పేద ప్రజలను మరింత ఆర్థిక ఇబ్బందుల్లో నెడుతుందని ఆ పరిశ్రమ వాదిస్తున్నప్పటికీ, బలహీన సామాజిక వర్గాల్లో దీని వాడకం హానికరమని విస్మరిస్తోందని డబ్ల్యూహెచ్వో మాన్యువల్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
జపాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆచరించే ఓ సంప్రదాయం గురించిన విషయాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. -
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
నెటిఫ్లిక్స్ (Netflix) నిరసన సెగను ఎదుర్కొంటోంది. దానిని బాయ్కాట్ చేయాలంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..