ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి.. అవాక్కయిన నెటిజన్లు
ఇంటి అద్దెలు భరించలేక.. ఓ యువతి మరో రాష్ట్రంలోని ఉద్యోగానికి విమానంలో వెళ్లొస్తోంది. అదేంటీ.. అద్దె కంటే విమానయానం ఖర్చు మరీ అంత తక్కువా? అని ఆలోచిస్తున్నారా? ఆ కథేంటో మీరే చదివేయండి..!
ఇంటర్నెట్ డెస్క్: ఖరీదైన ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి ఇంటి అద్దెలు భరించడం చాలా కష్టం. అందుకే, చాలా మంది కష్టమైన సరే.. రెంట్ తక్కువగా ఉంటుందని సుదూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు వెళ్తుంటారు. బండి మీదో, బస్సులోనే గంటల తరబడి ట్రాఫిక్ను దాటుకుంటూ విధులకు చేరుకుంటారు. అయితే, అమెరికా (USA)లో ఓ అమ్మాయి మాత్రం ఇంటి అద్దెలు భరించలేక.. వందల మైళ్లు ప్రయాణం చేస్తోంది. అది కూడా విమానంలో..! వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం..!
సౌత్ కరోలినా (South Carolina)లోని కార్లెస్టన్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సోఫియా సెలెంటానో (Sophia Celentano) యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియాలో చదువుతోంది. వేసవి సెలవులకు కార్లెస్టన్కు వచ్చిన ఆమెకు న్యూజెర్సీలోని ఒగిలివ్ హెల్త్ అనే అడ్వర్టైజింగ్ సంస్థలో సమ్మర్ ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభించింది. అయితే న్యూజెర్సీ (New Jersey)లో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ. శివారు ప్రాంతాల్లో ఉండాలన్న కనీసం నెలకు 3400 డాలర్లు చెల్లించాలి. అయితే, రెండునెలల తన ఇంటర్న్షిప్ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలట. దీంతో అద్దెలు భరించలేని ఆమె వినూత్న ఆలోచన చేసింది.
కార్లెస్టన్ నుంచి సుమారు 700 మైళ్ల దూరంలో ఉన్న న్యూజెర్సీకి వారానికి ఒక రోజు విమానంలో వెళ్తోంది. రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆమె ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా.. అందుకు విమాన టికెట్, క్యాబ్ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుందట. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం కంటే.. తన ఇంటి నుంచే వెళ్లడం మంచిదని భావించిన సోఫియా.. విమానప్రయాణం చేస్తోంది. అయితే, ఇందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని, రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నానని ఆమె చెబుతోంది.
ఈ విషయాన్ని సోఫియా ఇటీవల తన సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె జర్నీ కథ తెలుసుకుని నెటిజన్లు అవాక్కవుతున్నారు. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం అంత ఇబ్బందులు పడటం అవసరమా? అంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా.. సోఫియా స్టోరీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ