Sodium: అధిక ఉప్పు ముప్పే.. ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక
అధిక మోతాదులో ఉప్పు (Salt)ను తీసుకోవడం హృదయ సంబంధ వ్యాధులతోపాటు(Heart Diseases) మరణాలకూ దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వినియోగం గణనీయంగా పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార పదార్థాల ద్వారా సోడియం(Sodium) తీసుకునే మోతాదును 2025 నాటికి 30 శాతం తగ్గించాలని పెట్టుకున్న లక్ష్యానికి చాలా దేశాలు ఎంతో దూరంగా ఉన్నాయని పేర్కొంది. ఇలా అధిక మోతాదులో ఉప్పును తీసుకోవడం హృదయ సంబంధిత వ్యాధులతోపాటు మరణాలకూ దారితీస్తుందని హెచ్చరించింది. అధిక మోతాదులో సోడియం వాడటం హృద్రోగ (Heart Diseases), మూత్రపిండాల వ్యాధులు, ఊబకాయం (Obesity), గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్ట్రోక్, అకాల మరణాలకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
- శరీరానికి అవసరమైన సోడియం మనకు ఉప్పు (Salt) నుంచి లభిస్తుంది. దీంతోపాటు కొన్ని సహజ ఆహార పదార్థాల్లోనూ సోడియం గ్లుటామేట్ రూపంలో దొరుకుతుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రపంచ సగటు ఉప్పు వినియోగం రోజుకు 10.8 గ్రాములుగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్వో సిఫార్సు కంటే ఇది రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం.
- డబ్ల్యూహెచ్వో సభ్య దేశాల్లో కేవలం 5 శాతం మాత్రమే తప్పనిసరి, సమగ్ర సోడియం తగ్గింపు విధానాలను అమలు చేస్తున్నాయని, 73 శాతం సభ్యదేశాలు అటువంటి విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని నివేదికలో తేలింది. ‘భారత్లో ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్పై తప్పనిసరి సోడియం డిక్లరేషన్ నిబంధన ఉంది. ఇతర తప్పనిసరి చర్యలు ఏమీ లేవు’ అని పేర్కొంది. అయితే, సోడియం తగ్గింపు విధానాలను అమలు చేయడం వల్ల 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని నివేదిక పేర్కొంది.
- ‘అనారోగ్యకర ఆహార అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా మరణాలు, వ్యాధులకు ప్రధాన కారణం. సోడియం అధికంగా తీసుకోవడం కూడా ఇందులో ఒకటి’ అని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. ‘అనేక దేశాలు ఇంకా ఎటువంటి తప్పనిసరి సోడియం తగ్గింపు విధానాలను అవలంబించలేదని ఈ నివేదిక చెబుతోంది. ఫలితంగా అక్కడి ప్రజలకు గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పొంచి ఉంది’ అని టెడ్రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం