Sodium: అధిక ఉప్పు ముప్పే.. ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక
అధిక మోతాదులో ఉప్పు (Salt)ను తీసుకోవడం హృదయ సంబంధ వ్యాధులతోపాటు(Heart Diseases) మరణాలకూ దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వినియోగం గణనీయంగా పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార పదార్థాల ద్వారా సోడియం(Sodium) తీసుకునే మోతాదును 2025 నాటికి 30 శాతం తగ్గించాలని పెట్టుకున్న లక్ష్యానికి చాలా దేశాలు ఎంతో దూరంగా ఉన్నాయని పేర్కొంది. ఇలా అధిక మోతాదులో ఉప్పును తీసుకోవడం హృదయ సంబంధిత వ్యాధులతోపాటు మరణాలకూ దారితీస్తుందని హెచ్చరించింది. అధిక మోతాదులో సోడియం వాడటం హృద్రోగ (Heart Diseases), మూత్రపిండాల వ్యాధులు, ఊబకాయం (Obesity), గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్ట్రోక్, అకాల మరణాలకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
- శరీరానికి అవసరమైన సోడియం మనకు ఉప్పు (Salt) నుంచి లభిస్తుంది. దీంతోపాటు కొన్ని సహజ ఆహార పదార్థాల్లోనూ సోడియం గ్లుటామేట్ రూపంలో దొరుకుతుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రపంచ సగటు ఉప్పు వినియోగం రోజుకు 10.8 గ్రాములుగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్వో సిఫార్సు కంటే ఇది రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం.
- డబ్ల్యూహెచ్వో సభ్య దేశాల్లో కేవలం 5 శాతం మాత్రమే తప్పనిసరి, సమగ్ర సోడియం తగ్గింపు విధానాలను అమలు చేస్తున్నాయని, 73 శాతం సభ్యదేశాలు అటువంటి విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని నివేదికలో తేలింది. ‘భారత్లో ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్పై తప్పనిసరి సోడియం డిక్లరేషన్ నిబంధన ఉంది. ఇతర తప్పనిసరి చర్యలు ఏమీ లేవు’ అని పేర్కొంది. అయితే, సోడియం తగ్గింపు విధానాలను అమలు చేయడం వల్ల 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని నివేదిక పేర్కొంది.
- ‘అనారోగ్యకర ఆహార అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా మరణాలు, వ్యాధులకు ప్రధాన కారణం. సోడియం అధికంగా తీసుకోవడం కూడా ఇందులో ఒకటి’ అని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. ‘అనేక దేశాలు ఇంకా ఎటువంటి తప్పనిసరి సోడియం తగ్గింపు విధానాలను అవలంబించలేదని ఈ నివేదిక చెబుతోంది. ఫలితంగా అక్కడి ప్రజలకు గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పొంచి ఉంది’ అని టెడ్రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం