Viral news: పిడిగుద్దులు.. గాల్లోకి లేచిన కుర్చీలు.. రివర్‌పార్కులో రచ్చరచ్చ

బోటును ముందుకు తీయాలని సెక్యూరిటీ గార్డు చెప్పాడన్న కోపంతో కొందరు శ్వేతజాతీయులు అతడిపై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Published : 07 Aug 2023 17:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొందరు శ్వేత జాతీయులు, ఓ నల్లజాతీయుడైన సెక్యూరిటీ గార్డును విచక్షణా రహితంగా కొట్టేశారు. ఇష్టమొచ్చినట్లుగా పిడిగుద్దులు గుద్దారు. అక్కడున్న కుర్చీలను విసిరేశారు. అడ్డుకున్న వారిపైనా దాడికి దిగారు. ఈ ఘటన అమెరికాలోని అలబామాలో ఓ నది ఒడ్డున ఉన్న పార్కులో చోటు చేసుకుంది. పెద్ద బోటు వస్తోందని, అందువల్ల అక్కడి పాంటూన్‌ బోటును తీయాలని సెక్యూరిటీ గార్డు ఓ శ్వేత జాతీయుడిని కోరడంతో ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ గార్డుకు మద్దతుగా మరికొందరు అక్కడి వచ్చి శ్వేతజాతీయులపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన మాంట్‌గోమేరీ పోలీసులు పలువురి అరెస్టు చేసినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని