Yoga at UN: యోగాకు ఎలాంటి పేటెంట్, రాయల్టీలు లేవు: ప్రధాని మోదీ
యోగాకు ఎలాంటి కాపీరైట్, పేటెంట్, రాయల్టీ లేవని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
న్యూయార్క్: యోగా (Yoga) ఏ ఒక్క దేశం, మతం, వర్గానికి చెందినది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. దీనికి ఎలాంటి కాపీరైట్, పేటెంట్, రాయల్టీలు లేవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Day of Yoga) సందర్భంగా న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయం (United Nations) వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐరాస ఉన్నతాధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలతోపాటు 180 దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ఇందులో భాగస్వామ్యమయ్యారు.
‘ప్రతిదేశం నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తొమ్మిదేళ్ల క్రితం ఇక్కడనుంచే ప్రతిపాదించాను. యావత్ ప్రపంచం దీనికి మద్దతు పలకడం సంతోషంగా ఉంది. యోగా భారత్ నుంచి వచ్చింది. దీనికి అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. అన్ని ప్రాచీన సంప్రదాయాల మాదిరిగానే ఇది కూడా సజీవమైనది, ఎంతో చైతన్యమైనది. అన్ని దేశాల సంప్రదాయాలకు సరిపోయే విధానం యోగా. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుంది. దీనికి ఎటువంటి కాపీరైట్లు, పేటెంట్లు, రాయల్టీ చెల్లింపులు లేవు. మీ వయసు, లింగం, ఫిట్నెస్ స్థాయిలను బట్టి దీన్ని అలవరచుకోవచ్చు. ఇది పూర్తిగా విశ్వజనీనం.. ఆరోగ్యకరమైంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2023ను మిల్లెట్ ఇయర్ (తృణ ధాన్యాల ఏడాది)గా ప్రకటించాలని భారత్ చేసిన ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిదన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతోపాటు అంతర్జాతీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. న్యూయార్క్ మేయర్, మూడుసార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ కెజ్, గాయని ఫాల్గుణి షా, నటులు రిచర్డ్ గేర్, ప్రియాంక చోప్రాతోపాటు ఐక్యరాజ్య సమితి అధికారులు ఈ యోగా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
న్యూయార్క్లో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోదీ రాజధాని వాషింగ్టన్ డీసీకి వెళ్తారు. అక్కడి ఆండ్రూ ఎయిర్బేస్లో ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలుకుతారు. వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈవోలతోపాటు ఇతర ప్రముఖులతో వరుస భేటీలు ఉంటాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. వైట్హౌస్లో గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత అధ్యక్షుడి కార్యాలయంలో ఇరుదేశాల అధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ సాయంత్రం అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా