Zelensky: ‘రష్యా చేతిలో బందీ కావడం’ తీవ్ర అవమానకరమే..!
అధ్యక్ష భవనంపై రష్యన్లు (Russia) దాడి చేస్తే బందీగా లొంగడం (Captive) బదులు సహచరులతో పాటు తాను కూడా ప్రాణాలకు తెగించి పోరాడేవాడినని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Volodymyr Zelensky) ఉద్ఘాటించారు.
కీవ్: సైనిక చర్య పేరుతో రష్యా మొదలుపెట్టిన దురాక్రమణతో (Russia Invasion) ఉక్రెయిన్ మొత్తం నాశనమైంది! వేల మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు కొన్ని నగరాలు, పట్టణాలు నామరూపాల్లేకుండా పోయాయి. అయినప్పటికీ.. ఉక్రెయిన్ (Ukraince Crisis) మాత్రం ఏడాదికిపైగా తన ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలైన నాటి పరిస్థితులను గుర్తుచేసిన అధ్యక్షుడు జెలెన్స్కీ (Volodymyr Zelensky).. అప్పట్లో తాను తుపాకీ పట్టుకొని తిరిగానన్నారు. తనపై రష్యన్లు దాడి చేస్తే బందీగా పట్టుబడటానికి బదులు తన సహచరులతో కలిసి ప్రాణాలకు తెగించి పోరాడే వాడినన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
‘అధ్యక్ష కార్యాలయంలోకి శత్రుమూకలు ప్రవేశిస్తే.. నేడు మేం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. బాంకోవా స్ట్రీట్ వద్ద కట్టుదిట్టమైన ప్రతిఘటన బలగాలు ఉండటం వల్ల ఒక్కరు కూడా ఖైదీలుగా మారలేదు. ‘ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యా చేతిలో బందీగా మారాడు’ అనే హెడ్లైన్ను మీరు ఊహించగలరా..? ఇది చాలా అవమానకరం. దాన్ని తలవంపుగా భావిస్తా’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. ఆ సమయంలో తన దగ్గరా ఒక తుపాకీ పెట్టుకున్నానని.. కాల్చడం ఎలాగో తెలుసని చెప్పారు. రష్యా సేనలకు పట్టుబడితే ఆత్మహత్య చేసుకోవడానికి ఆ తుపాకీ ఉపయోగించేవారా..?అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. శత్రువులపై దాడి చేసేందుకే దాన్ని తన వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టింది. ఆ సమయంలో కీవ్పై దాడి చేసేందుకు రష్యా బృందాలు ప్రయత్నాలు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. అయితే, అధ్యక్ష భవన సముదాయాల్లోకి ప్రవేశించి దాడి జరిపేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదన్నారు. కీవ్ సమీపానికి రష్యా సైన్యం చేరుకున్నప్పటికీ ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటించడంతో నగరంలోకి ప్రవేశించలేకపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు