Zelensky: వరదలో కొట్టుకొస్తున్న మందుపాతరలు.. ఆ డ్యామ్ ఓ టైం బాంబ్..!
ఉక్రెయిన్లోని కఖోవ్కా డ్యాం పరిధిలో పరిస్థితి ఘోరంగా ఉంది. చాలా చోట్ల నీరు 5 మీటర్లకుపైగా ఎత్తుకు చేరింది. ఇరు వర్గాల సేనలు పలు చోట్ల పాతిన మందుపాతరలు నీటిలో కొట్టుకుపోయి.. జనావాసాల్లోకి చేరుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: యుద్ధ ప్రభావిత దక్షిణ ఖేర్సన్ వద్ద కఖోవ్కా డ్యాం వరదలో మునిగిన ప్రదేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉక్రెయిన్, రష్యా దళాలు అమర్చిన యాంటీ ట్యాంక్ మైన్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఇవి ఎక్కడి వెళ్లాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సహాయక బృందాలకు ప్రాణాంతకంగా మారింది.
పులిమీద పుట్రలా మందుపాతరలు..
కఖోవ్కా డ్యాం వరద దెబ్బకు స్థానికులు భయంభయంగా జీవిస్తున్నారు. ఆ ప్రదేశంలో ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా దళాలు అమర్చిన మందుపాతరలను గుర్తించి తొలగించడం చాలా కష్టంగా మారిందని రెడ్క్రాస్ పేర్కొంది. ముఖ్యంగా ఇక్కడ టీఎం-57 మైన్లను అమర్చారు. వరద దెబ్బకు ఇక్కడ పాతిన ఆ మందుపాతరలు దిగువ ప్రదేశాలకు కొట్టుకుపోయాయి. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆ మైన్లు అక్కడి ప్రజలకే కాదు.. సహాయక బృందాలకు కూడా ముప్పుగా మారాయి. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మైన్లు ఉండొచ్చని రెడ్క్రాస్ చెబుతోంది.
జెలెన్స్కీ పర్యటన..
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నేడు వరద తాకిడి ప్రదేశాలను సందర్శించారు. ప్రజలను ఖాళీ చేయించిన ప్రదేశాలకు కూడా ఆయన వెళ్లారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. స్థానిక ఎమర్జెన్సీ వర్కర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ‘‘ప్రజల ప్రాణాలను కాపాడటమే మా విధి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహాయక బృందాలు, వాలంటీర్లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
దక్షిణ ఖేర్సాన్లో దాదాపు 600 కిలోమీటర్ల మేర భూభాగం నీటమునిగింది. ఈ విషయాన్ని స్థానిక ఉక్రెయిన్ మిలటరీ కమాండర్ ధ్రువీకరించారు. చాలా చోట్ల నీటి మట్టం 5.61 మీటర్లకు చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా నీపర్ నది తూర్పు భాగం లోతట్టులో ఉండటంతో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. మొత్తం వరదలో దాదాపు 60శాతానికి పైగా తూర్పు తీరంలోనే ఉంది. మరో 30శాతం పశ్చిమ భాగాన ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చాలా చోట్ల నీటిలో చిక్కుకుపోయిన వారి వద్ద మంచినీరు కూడా లేకపోవడంతో డ్రోన్ల సాయంతో వాటర్ బాటిళ్లను జారవిడుస్తున్నారు.
ఓ వైపు వరద తీవ్రత ఎక్కువగా ఉన్నా.. మరో వైపు రష్యా దళాలు కాల్పులు జరుపుతున్నాయని ఉక్రెయిన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వరద సహాయ బృందాలపై కాల్పులు జరుగుతున్నాయని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. జర్మనీకి చెందిన ఓ పత్రికతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.
డ్యామ్ విధ్వంసం ఉద్దేశపూర్వకమా..?
గతేడాది ఆగస్టు, నవంబర్లో జరిగిన పోరు కారణంగా డ్యామ్ కొంత దెబ్బతిందని నిపుణులు వెల్లడించారు. మరికొందరు నిపుణులు మాత్రం ఈ ఆనకట్ట రష్యా ఆధీనంలో ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే నీటి నిల్వలను సామర్థ్యానికి మించి పెంచి డ్యామ్ దెబ్బతీసేట్లు చేశాయని పేర్కొన్నారు.
ఇక ఆనకట్ట వద్ద పరిస్థితులకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను అమెరికాలోని ఫారెన్ అగ్రికల్చర్ సర్వీస్ సేకరించింది. వీటిని విశ్లేషించగా.. గత కొన్ని నెలల్లో నీటి నిల్వలు వేగంగా పెరిగినట్లు గుర్తించింది. అప్పటికే జరిగిన పోరు కారణంగా డ్యామ్ దెబ్బతినగా.. ఆపై నీటి నిల్వలు పెరగడం దానిని కుప్పకూల్చిందని అనుమానిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ.. అధికారికంగా ప్రకటించిన కమలా హారిస్
డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలాహారిస్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం