Zelenskyy: మా భూభాగాల విముక్తికే.. రష్యాపై ఎదురుదాడి!
రష్యా ఆక్రమిత ప్రాంతాల విముక్తి కోసమే ఎదురుదాడులకు సిద్ధమవుతున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా భూభాగంపై దాడులు చేయబోమని స్పష్టం చేశారు.
బెర్లిన్: అమెరికా, బ్రిటన్ తదితర పాశ్చాత్య దేశాలు సమకూర్చిన ఆయుధాలతో రష్యా (Russia)పై ఎదురుదాడులకు ఉక్రెయిన్ (Ukraine) సిద్ధమవుతోందని వార్తలు వస్తోన్న వేళ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఆక్రమించిన తమ భూభాగాలను విముక్తి చేసేందుకే ఎదురుదాడుల (Counteroffensive)కు సిద్ధమవుతున్నామని, రష్యా భూభాగంపై దాడుల కోసం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జర్మనీ (Germany) పర్యటనలో ఉన్న జెలెన్స్కీ (Zelenskyy).. ఛాన్స్లర్ ఓలాఫ్ షోల్జ్తో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దుల ఆధారంగా ఉక్రెయిన్ భూభాగాలను రష్యా నుంచి విడిపించడమే తమ లక్ష్యమని తెలిపారు.
రష్యా భూభాగాలపైనా దాడి చేసి, కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకే ఉక్రెయిన్ ఎదురుదాడులకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మాస్కోతో శాంతి చర్చల సందర్భంగా ఆక్రమిత భాగాలను బేరసారాలుగా ఉపయోగించుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై జెలెన్స్కీ స్పందిస్తూ.. ‘మేం రష్యా భూభాగంపై దాడి చేయం. మాకంత సమయం లేదు. సామర్థ్యం కూడా లేదు. పైగా ఆయుధ సామగ్రి కూడా లేదు. కేవలం మా భూభాగాన్ని విముక్తి చేసేందుకు ఎదురుదాడికి సిద్ధం అవుతున్నాం’ అని తెలిపారు. ఈ క్రమంలోనే జర్మనీ తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అవసరం ఉన్నంతవరకు కీవ్కు సాయం అందిస్తామని షోల్జ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న జెలెన్స్కీ.. శనివారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, పోప్ ఫ్రాన్సిస్లతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలతోసహా రూ.24 వేల కోట్లకు పైగా సైనిక సాయాన్ని జర్మనీ ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే జెలెన్స్కీ ఇక్కడికి చేరుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలు జర్మనీలో ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. మొదట్లో ఉక్రెయిన్కు ఆయుధాలను అందించడానికి వెనుకాడిన జర్మనీ.. ఇప్పుడు ఈ విషయంలో అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా