Bonda Uma: జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలుకెళ్లేది అధికారులే: బొండా ఉమ

సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలుపాలయ్యేది అధికారులేనని తెదేపా నేత బొండా ఉమ హెచ్చరించారు.

Updated : 21 May 2024 15:54 IST

సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలుపాలయ్యేది అధికారులేనని తెదేపా నేత బొండా ఉమ హెచ్చరించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలి. తెదేపా నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు, భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డిపై  చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి’’ అని బొండా ఉమ డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని