Chandrababu: తుపాను బాధితులకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు

మిగ్‌జాం (Cyclone Michaung) తుపాను బాధిత ప్రజలకు అవసరమైన ఆహారం, మంచినీరు, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. తుపానుపై ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సన్నద్ధత చేయలేదని మండిపడ్డారు. బాధితులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టలేదని వారు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. అనంతరం 12 వేల మంది పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా తక్షణం బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. 

Published : 06 Dec 2023 10:41 IST

మిగ్‌జాం (Cyclone Michaung) తుపాను బాధిత ప్రజలకు అవసరమైన ఆహారం, మంచినీరు, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. తుపానుపై ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సన్నద్ధత చేయలేదని మండిపడ్డారు. బాధితులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టలేదని వారు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. అనంతరం 12 వేల మంది పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా తక్షణం బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. 

Tags :

మరిన్ని