Sangareddy: రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్‌, భారాస శ్రేణుల ఘర్షణ.. ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్, భారాస శ్రేణులు పరస్పరం చేసుకున్న దాడుల్లో ఒకరు మృతి చెందారు.

Published : 21 Apr 2024 12:51 IST

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్, భారాస శ్రేణులు పరస్పరం చేసుకున్న దాడుల్లో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద 2023లో తండాకు సీసీ రోడ్డు మంజూరైంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతంలో నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా మరోచోట రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనిపై చర్చించేందుకు తండావాసులు సమావేశమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్, భారాస కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కర్రలు, రాళ్లతో ఒకరిపై మరొకరు దాడికి దిగడంతో శ్రీను నాయక్ అనే వ్యక్తి మృతిచెందాడు. 

Tags :

మరిన్ని