Kolkata vs Hyderabad: కోల్‌కతా ఆటగాళ్ల గెలుపు సంబరాలు చూశారా..?

ఐపీఎల్‌ 2024 విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అవతరించింది. చెపాక్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఆజట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో కోల్‌కతా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. స్టేడియంలోకి ఒక్కసారిగా పరుగులు తీశారు. 

Published : 27 May 2024 00:44 IST

ఐపీఎల్‌ 2024 విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అవతరించింది. చెపాక్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఆజట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో చెలరేగిన కోల్‌కతా.. సన్‌రైజర్స్‌ను 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 10.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టులో వెంకటేశ్‌ అయ్యర్‌ (52*), అర్ధశతకంతో దంచికొట్టగా, గుర్బాజ్‌ (39) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాచ్‌ గెలిచినవెంటనే కోల్‌కతా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. జట్టు సభ్యులు స్టేడియంలోకి పరుగులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం కోల్‌కతా విజయ సంబరాలు చూసేయండి ఇక..

Tags :

మరిన్ని