Kanakamedala: వైకాపా నేతల కనుసన్నల్లోనే దాడులు!: కనకమేడల

గతంలో మాచర్లలో నడిరోడ్డుపై తెదేపా కార్యకర్త గొంతుకోసి చంపారని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయని మండిపడ్డారు.

Published : 21 May 2024 17:44 IST

గతంలో మాచర్లలో నడిరోడ్డుపై తెదేపా కార్యకర్త గొంతుకోసి చంపారని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయని మండిపడ్డారు. గత రెండేళ్లుగా మాచర్లలో వైకాపా హింస కొనసాగుతున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తప్పనిసరి కేసులు నమోదు చేయాల్సి వస్తే నామమాత్రపు కేసులు పెట్టారని ఆక్షేపించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి, అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి సీతారామాంజనేయులు కనుసన్నల్లో దాడులు జరిగాయన్నారు. సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టి కటకటాల్లోకి పంపాలని కనక మేడల డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని