Chandrababu: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ

విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మహాకూటమి పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు నాయుడుని ఈ సందర్భంగా గవర్నర్ ఆహ్వానించారు.

Published : 11 Jun 2024 20:16 IST

విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మహాకూటమి పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు నాయుడుని ఈ సందర్భంగా గవర్నర్ ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాజ్‌భవన్‌కు చేరుకుని మర్యాదపూర్వకంగా గవర్నర్‌తో సమావేశమయ్యారు. తనకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను ఈ సందర్భంగా గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. గవర్నర్‌తో భేటీ అయిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

మరిన్ని