Rammohan Naidu: కేంద్రమంత్రి పదవి దక్కించుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి, తెదేపా యువ నేత రామ్మోహన్‌ నాయుడు తొలిసారి కేంద్ర మంత్రిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. ఆయన గురించి కొన్ని విషయాలు...

Updated : 10 Jun 2024 09:30 IST

పులి కడుపులో పులే పుడుతుందనే నానుడిని నిజం చేస్తూ.. రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొద్ది రోజుల్లోనే ఆ యువనేత సిక్కోలు సింహంలా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో గళం వినిపించగా ప్రత్యర్థులూ ఆయన వాగ్ధాటికి ముగ్దులయ్యారు. అనేక సమస్యలపై గొంతెత్తగా నేటికీ సోషల్ మీడియాలో ఆ వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిబద్ధత, అంకితభావం మెండుగా ఉన్న ఆ యువకుడే ఇప్పుడు మోదీ కేబినెట్‌లో చోటు సంపాదించారు. ఆయనే వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. కేంద్రమంత్రి పదవి దక్కించుకున్న వేళ ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని