Pinnelli: పిన్నెల్లి సోదరుల మాఫియాపై తెదేపా పుస్తకం

మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేటు ఎస్టేటుగా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని, ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది.

Published : 29 May 2024 10:35 IST

మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేటు ఎస్టేటుగా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని, ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ‘ప్రజలంతా తమ బానిసలనే విధంగా మాచర్లలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకుని వేధించారు. పిన్నెల్లి దోపిడీ రూ.2 వేల కోట్లు. ఆయన మాఫియా చేసిన హత్యలు 8, అన్ని వర్గాలపై దాడులు 79’ అని వివరించింది. ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో తెదేపా 28 పేజీలతో రూపొందించిన పుస్తకం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Tags :

మరిన్ని