Chandrababu: కౌంటింగ్‌ రోజూ హింసకు వైకాపా కుట్ర: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు.

Published : 30 May 2024 09:18 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. కౌంటింగ్‌రోజూ హింసకు వైకాపా కుట్రలు పన్నుతుందని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ మార్గదర్శకాలపై అసత్యప్రచారాల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శుక్ర, శనివారాల్లో కౌంటింగ్‌ ఏజెంట్లందరికీ జోన్‌ల వారీగా శిక్షణ ఇవ్వాలని నేతలను ఆదేశించారు. తక్కువ మంది కౌంటింగ్‌ అబ్జర్వర్‌లను నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. భద్రతపై ఈసీ, డీజీపీకి లేఖలు రాయాలని నిర్ణయించారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు