Hyderabad: హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధం

Eenadu icon
By Video News Team Published : 02 Sep 2025 10:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ సర్వం సిద్ధం చేసింది. రూ.54 కోట్లతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు 20 చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు. సుమారు 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనం విధుల్లో ఉండనున్నారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో నిమజ్జన సందడి కొనసాగుతుండగా.. 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్ల ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఈ వార్త చదివారా: ఇక టీచర్లకు టెట్‌ పాస్‌ తప్పనిసరి: సుప్రీంకోర్టు

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు