Hyderabad: రోడ్ల నిర్మాణంపై బల్దియా నిర్లక్ష్యం.. రూ.కోట్ల ప్రజాధనం వృథా

Eenadu icon
By Video News Team Updated : 08 Jul 2025 13:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

బల్దియా నిర్లక్ష్యం హైదరాబాద్‌ను అభాసుపాలు చేస్తోంది. వేసవిలో చేయాల్సిన రోడ్ల మరమ్మతులు వర్షాకాలంలో చేస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. జీహెచ్‌ఏంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి శాఖల మధ్య సరైన సమన్వయం లేకపోవటమే దీనికి ప్రధాన కారణం. ప్రణాళిక లేకుండా అభివృద్ధి పనులపేరిట రూ.కోట్ల ప్రజాధనం వృథా చేస్తోంది. వర్షాకాలంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టొద్దని జీహెచ్‌ఎంసీ పైకి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. గుత్తేదారులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేసి వదిలేయడంతో పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ వార్త చదివారా: అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే

Tags :
Published : 08 Jul 2025 13:13 IST

మరిన్ని

సుఖీభవ

చదువు