Mumbai: ముంబయిలోకి వచ్చే లైట్‌ మోటార్‌ వాహనాలకు నో టోల్‌ ఫీజు: ఏక్‌నాథ్ శిందే

Eenadu icon
By Video News Team Updated : 14 Oct 2024 14:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముంబయిలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు ఇకపై టోల్ ఫీజు ఉండబోదని ప్రకటించింది. ముంబయిలో సీఎం శిందే నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబయి నగరంలోకి ప్రవేశించే టోల్‌ ప్లాజాల వద్ద లైట్ మోటార్ వాహనాలకు ఇకపై టోల్ ఫీజు వసూలు చేయబోమని సీఎం శిందే తెలిపారు. కార్లు, ఎస్ యూవీలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ అర్ధరాత్రి నుంచే ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. అలాగే, మహారాష్ట్ర స్టేట్ స్కిల్‌ డెవలప్‌మెంట్  సెంటర్‌కు దివగంత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరును పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

Tags :
Published : 14 Oct 2024 14:58 IST

మరిన్ని

సుఖీభవ

చదువు