Earthquake: కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సోమవారం స్వల్ప భూకంపం

Eenadu icon
By Video News Team Updated : 06 May 2025 12:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల వాసులను స్వల్ప భూకంపం ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సుమారు 5 సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన కేంద్రం గుర్తించింది. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో భూమి కంపించిన విషయాన్ని చాలా మంది గుర్తించలేదు. పలువురు మాత్రం భయందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీసి రోడ్లపైకి వచ్చారు. కొన్నిచోట్ల సీసీ కెమెరాల్లో భూ కంపనాలు కనిపించాయి. ఈ వార్త చదివారా: నేడు, రేపు భారీ వర్షాలు

Tags :
Published : 06 May 2025 12:29 IST

మరిన్ని

సుఖీభవ

చదువు