Tejashwi Yadav: బిహార్‌లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ఆర్జేడీ సిద్ధం: తేజస్వీయాదవ్‌

Eenadu icon
By Video News Team Updated : 14 Sep 2025 16:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

మహాఘట్‌ బంధన్‌(కాంగ్రెస్‌, సీపీఐ, ఆర్జేడీ, ఇతర చిన్న పార్టీలు)లో సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్‌ కీలక ప్రకటన చేశారు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ముజఫర్‌పుర్‌లో ఆదివారం జరిగిన పార్టీ ర్యాలీలో తేజస్వీయాదవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో తాము తిరిగి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వార్త చదివారా: దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్‌ రక్షిస్తోంది..: మోదీ

Tags :
Published : 14 Sep 2025 16:32 IST

మరిన్ని