Hyderabad: జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం.. అపరిశుభ్రతకు నిలయంగా అన్నపూర్ణ కేంద్రాలు

Eenadu icon
By Video News Team Published : 11 Jul 2025 13:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

బడుగుజీవుల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ మహానగరంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లు.. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతో ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. కొన్ని కేంద్రాల వద్ద పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో భోజనం చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నపూర్ణ కేంద్రాలను బల్దియా చిన్నచూపు చూస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పరిసరాల్లో శుచి, శుభ్రత లేక దుర్వాసన వస్తోందని, తినే నాలుగు మెతుకులైనా కడుపులోకి పోకముందే దేవేసినంత పనవుతోందని భోజనం చేస్తున్న పలువురు చెబుతున్నారు. ఈ వార్త చదివారా: భద్రాచలంలో 33.5 అడుగులకు చేరిన గోదావరి నీటమట్టం

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు