Kavitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు

Eenadu icon
By Video News Team Updated : 19 Oct 2025 09:56 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఈ నెల 25 నుంచి ‘జాగృతి జనం బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తెలిపారు. నాలుగు నెలలపాటు సాగనున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భర్త అనిల్‌తో కలిసి ఆదివారం తిరుమలకు వచ్చిన కవిత.. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కవిత దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ వార్త చదివారా: మొగిలయ్యకు అండగా ఉంటాం: కేటీఆర్‌

Tags :
Published : 19 Oct 2025 09:49 IST

మరిన్ని