NEET: నీట్‌ పరీక్షకు లీక్‌ల గండం..!

Eenadu icon
By Video News Team Published : 14 Jun 2024 13:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

వైద్యులుగా రాణించడం అంటే మామూలు విషయం కాదు. దానికెంతో కష్టమైన నీట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించాలి. దానికి ఎన్నో రోజుల ముందు నుంచే పుస్తకాలతో కుస్తీ పట్టాలి. అయినా వస్తుందన్న నమ్మకం లేదు. అలాంటి కఠినమైన పరీక్ష ఇప్పుడు జఠిలమైన సమస్య ఎదుర్కొంటోంది. నీట్ 2024 పరీక్షలో అక్రమాలు జరిగాయని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే 5న నీట్ యూజీ -2024 ప్రవేశ పరీక్ష జరగగా ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్ వచ్చింది. కొంతమందికి 718, 719 లాంటి అసంభవమైన మార్కులు రావడమే చర్చనీయాంశంగా మారింది. మరి ఇదంతా ఏంటి? అసలు, నీట్ పరీక్షలో నిజంగా అక్రమాలు జరిగాయా? గ్రేస్ మార్కులు అంటే ఏంటి? ఆ విద్యార్థులకు ఎందుకు కలిపారు? 

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు