బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424003343_41763.jpg)
23 Apr 2024 | 23:31 IST
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ విజయం
చెన్నై: ఐపీఎల్-2024లో లఖ్నవూ ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లఖ్నవూ బ్యాటర్లలో మార్కస్ స్టాయినిస్ (124*; 63 బంతుల్లో) శతకంతో అదరగొట్టాడు. పూరన్ (34; 14 బంతుల్లో), దీపక్ హూడా (17*; 6 బంతుల్లో) చెలరేగి ఆడారు. చెన్నై బౌలర్లలో పతిరన 2, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108*), శివం దుబే (66) చెలరేగి ఆడారు. లఖ్నవూ బౌలర్లలో హెన్రీ, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
- అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
- పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
- ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
- అందమే.. అగాధంలోకి తోసింది
- మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
- హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
- ‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
- రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?