బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 12:17 IST

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

దిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని తెలిపింది. అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 9 లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు తెలిపింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ తేదీ లోపు అఫిడవిట్‌ ఇవ్వాలని ఆదేశించింది.

మరిన్ని

తాజా వార్తలు