19/08/2023 11:09(IST)
రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సమక్షంలో నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి భారాస నేతలు కాంగ్రెస్లో చేరారు. సర్పంచులు వెంకటస్వామి, అమృత్రెడ్డి, తిరుపతయ్య, ఎంపీటీసీ అంజి, మాజీ సర్పంచులు అలియా నాయక్, రాంచందర్, మాజీ ఎంపీపీ రాములు, వార్డు సభ్యులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో రేవంత్రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.