NZ vs IND: కుప్పకూలిన కివీస్‌.. భారత్‌ 65 పరుగుల తేడాతో ఘన విజయం

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో టీమ్‌ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 191/6 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ 126 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ (61) ఒంటరిపోరాటం చేసినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో దీపక్ హుడా (4/10) అదరగొట్టగా.. చాహల్ 2, సిరాజ్‌ 2.. భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్ చెరో వికెట్‌ తీశారు. భారత ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ (111*) శతకంతో కీలక పాత్ర పోషించాడు. చివరి మ్యాచ్‌ నేపియర్ వేదికగా నవంబర్ 22న జరగనుంది.

Updated : 20 Nov 2022 16:10 IST