IND vs ZIM: జింబాబ్వేపై ఘన విజయం.. అగ్రస్థానంతో సెమీస్‌కు భారత్‌

జింబాబ్వేపై విజయంతో గ్రూప్ - 2లో భారత్‌ అగ్రస్థానానికి చేరింది. జింబాబ్వేపై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.  తొలుత టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 186/5 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 115 పరగులకు కుప్పకూలింది. బర్ల్ (35), సికందర్ రజా (34) పోరాడిన ప్రయోజనం లేదు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3, హార్దిక్ 2, షమీ 2.. అర్ష్‌దీప్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. ఇంగ్లాండ్‌తో నవంబర్ 10న టీమ్‌ఇండియా రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనుంది. 

Updated : 06 Nov 2022 17:30 IST