News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (18-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 18 Oct 2025 06:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
 హైదరాబాద్‌: మానుకు ప్రాణముంటుందని.. ప్రకృతితో మనిషి జీవితం  ముడిపడి ఉందని చెప్పకనే చెబుతోంది కదూ ఈ ఆకృతి. నార్సింగిలోని పుప్పాలగూడ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఈ నమూనా ఆకట్టుకుంటోంది. చెట్టు వేర్లు మనిషి ముఖాన్ని అల్లుకున్నట్లు తీర్చిదిద్దడంతో అటుగా వెళ్లే వారిని ఆలోచింపజేస్తోంది.   
 హైదరాబాద్‌: మానుకు ప్రాణముంటుందని.. ప్రకృతితో మనిషి జీవితం  ముడిపడి ఉందని చెప్పకనే చెబుతోంది కదూ ఈ ఆకృతి. నార్సింగిలోని పుప్పాలగూడ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఈ నమూనా ఆకట్టుకుంటోంది. చెట్టు వేర్లు మనిషి ముఖాన్ని అల్లుకున్నట్లు తీర్చిదిద్దడంతో అటుగా వెళ్లే వారిని ఆలోచింపజేస్తోంది.   
2/6
విశాఖపట్నం: జీఎస్టీ తగ్గింపు ఫలాల వేడుక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ మైదానంలో సందడిగా సాగుతోంది. ఏఏ వస్తువులపై ఎంతెంత జీఎస్టీ తగ్గిందో ఆయా స్టాల్స్‌ వద్ద వివరాలు ప్రదర్శిస్తున్నారు. అంతే కాదు...ఇక్కడి ప్రాంగణంలో ఉప్పుతో రూపొందించిన భారతదేశ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. 
 
విశాఖపట్నం: జీఎస్టీ తగ్గింపు ఫలాల వేడుక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ మైదానంలో సందడిగా సాగుతోంది. ఏఏ వస్తువులపై ఎంతెంత జీఎస్టీ తగ్గిందో ఆయా స్టాల్స్‌ వద్ద వివరాలు ప్రదర్శిస్తున్నారు. అంతే కాదు...ఇక్కడి ప్రాంగణంలో ఉప్పుతో రూపొందించిన భారతదేశ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.   
3/6
 శ్రీకాళహస్తి: జిల్లాలో అత్యంత పెద్దదైన తొండమనాడు చెరువు నిండుకుండలా మారింది. వర్షపు నీటితో తొణికిసలాడుతోంది. ఒరవ కాలువల నుంచి భారీగా ప్రవాహం చేరడంతో కలుజు పొంగిపొర్లుతోంది. రేణిగుంట- శ్రీకాళహస్తి ప్రధాన రహదారిని ఆనుకుని ఉండటంతో ఆ మార్గంలో వెళ్లేవారు కాసేపు సేదతీరుతున్నారు. 
 శ్రీకాళహస్తి: జిల్లాలో అత్యంత పెద్దదైన తొండమనాడు చెరువు నిండుకుండలా మారింది. వర్షపు నీటితో తొణికిసలాడుతోంది. ఒరవ కాలువల నుంచి భారీగా ప్రవాహం చేరడంతో కలుజు పొంగిపొర్లుతోంది. రేణిగుంట- శ్రీకాళహస్తి ప్రధాన రహదారిని ఆనుకుని ఉండటంతో ఆ మార్గంలో వెళ్లేవారు కాసేపు సేదతీరుతున్నారు. 
4/6
ఎస్వీయూలో జరుగుతున్న యువతరంగ్‌-2025 వేడుకలు రెండో రోజైన శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. శ్రీనివాస ఆడిటోరియంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వర్సిటీ పరిధిలో 30 కళాశాలల నుంచి 38 బృందాలు పాల్గొని ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చాయి. 
ఎస్వీయూలో జరుగుతున్న యువతరంగ్‌-2025 వేడుకలు రెండో రోజైన శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. శ్రీనివాస ఆడిటోరియంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వర్సిటీ పరిధిలో 30 కళాశాలల నుంచి 38 బృందాలు పాల్గొని ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చాయి. 
5/6
రామాపురం: దీపావళి పండగ తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందనుకుంటే పూల రైతులకు చీకట్లే మిగిలాయి. జిల్లాలో సాగయ్యే వివిధ రకాల పూలు పక్క జిల్లాలకే కాకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు కూడా ఎగుమతవుతుంటాయి. వివిధ మండలాల్లో వెయ్యి ఎకరాల వరకు పూలు సాగు చేస్తున్నారు.  
రామాపురం: దీపావళి పండగ తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందనుకుంటే పూల రైతులకు చీకట్లే మిగిలాయి. జిల్లాలో సాగయ్యే వివిధ రకాల పూలు పక్క జిల్లాలకే కాకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు కూడా ఎగుమతవుతుంటాయి. వివిధ మండలాల్లో వెయ్యి ఎకరాల వరకు పూలు సాగు చేస్తున్నారు.  
6/6
భూత్పూర్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తుగా దీపావళి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు అందమైన రంగవల్లులతో దీపాలంకరణ చేశారు. స్థానిక సాహితి పాఠశాలలో విద్యార్థులు దీపాలంకరణ రూపంలో కూర్చొని ఆకట్టుకున్నారు. 
భూత్పూర్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తుగా దీపావళి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు అందమైన రంగవల్లులతో దీపాలంకరణ చేశారు. స్థానిక సాహితి పాఠశాలలో విద్యార్థులు దీపాలంకరణ రూపంలో కూర్చొని ఆకట్టుకున్నారు. 
Published : 18 Oct 2025 06:22 IST

మరిన్ని

సుఖీభవ

చదువు