News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 23 Oct 2025 05:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/7
కార్తిక మాసం ప్రారంభమైంది. శివాలయాల్లో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలకు శ్రీకారం చుట్టారు. ఆలయాల్లో పారాయణాలు, భజనలు చేశారు. వేప, మామిడి, మారేడు, తులసి, రావి, జువ్వి, శమీ, కదంబ తదితర పవిత్ర వృక్షారాధనలు చేశారు. మహేశ్వరంలోని శివగంగరాజరాజేశ్వరస్వామి మందిరాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. 
కార్తిక మాసం ప్రారంభమైంది. శివాలయాల్లో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలకు శ్రీకారం చుట్టారు. ఆలయాల్లో పారాయణాలు, భజనలు చేశారు. వేప, మామిడి, మారేడు, తులసి, రావి, జువ్వి, శమీ, కదంబ తదితర పవిత్ర వృక్షారాధనలు చేశారు. మహేశ్వరంలోని శివగంగరాజరాజేశ్వరస్వామి మందిరాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. 
2/7
అందమైన ప్రకృతిలో జీవించే సీతాకోక చిలుకలు కనిపిస్తే ఆసక్తిగా తిలకిస్తుంటాం. వరంగల్‌ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని నాయుడు పెట్రోల్‌ పంపు కూడలిని ‘కుడా’ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ఇక్కడ ఇనుప లోహపు చువ్వలపై సీతాకోక చిలుకల ఆకృతులను తయారు చేయించి రంగులు అద్దారు. కూడలిలో అవి గుంపుగా వాలినట్లు  అటువైపుగా వెళ్లే వారందరికీ కనువిందు చేస్తున్నాయి.  
అందమైన ప్రకృతిలో జీవించే సీతాకోక చిలుకలు కనిపిస్తే ఆసక్తిగా తిలకిస్తుంటాం. వరంగల్‌ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని నాయుడు పెట్రోల్‌ పంపు కూడలిని ‘కుడా’ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ఇక్కడ ఇనుప లోహపు చువ్వలపై సీతాకోక చిలుకల ఆకృతులను తయారు చేయించి రంగులు అద్దారు. కూడలిలో అవి గుంపుగా వాలినట్లు  అటువైపుగా వెళ్లే వారందరికీ కనువిందు చేస్తున్నాయి.  
3/7
 వెంకటాపూర్‌: నృత్య భంగిమలు.. పొన్నచెట్టుపై శ్రీకృష్ణుడు మురళీ స్వరాలను వాయిస్తున్నట్ల్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలకు ఓ ప్రత్యేకత ఉంది. మ్యూజిక్‌ పిల్లర్‌గా పిలువబడే రాతి స్తంభంలో శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నట్లు కనిపిస్తున్న చెట్టు మొదలుపై  మీటితే సప్త స్వరాలు వినిపిస్తాయి. క్రీ.శ.1,213 సంవత్సరంలో కాకతీయులు రామప్ప ఆలయం నిర్మించారు. 
 వెంకటాపూర్‌: నృత్య భంగిమలు.. పొన్నచెట్టుపై శ్రీకృష్ణుడు మురళీ స్వరాలను వాయిస్తున్నట్ల్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలకు ఓ ప్రత్యేకత ఉంది. మ్యూజిక్‌ పిల్లర్‌గా పిలువబడే రాతి స్తంభంలో శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నట్లు కనిపిస్తున్న చెట్టు మొదలుపై  మీటితే సప్త స్వరాలు వినిపిస్తాయి. క్రీ.శ.1,213 సంవత్సరంలో కాకతీయులు రామప్ప ఆలయం నిర్మించారు. 
4/7
ఒంగోలు: తథాగతుడు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లు... ఆయనకు నిద్రాభంగం కలగకుండా మేఘాలు రక్షణ కవచంలా నిలిచినట్లు... చూడగానే మదిదోచేలా ఉంది కదూ ఈ చిత్రం. దొనకొండ మార్గంలో పొదిలి వైపుగా ఉన్న పృథుల గిరులు ఇలా దర్శనమిస్తూ అటుగా వెళ్లేవారిని కనువిందు చేస్తున్నాయి. 
ఒంగోలు: తథాగతుడు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లు... ఆయనకు నిద్రాభంగం కలగకుండా మేఘాలు రక్షణ కవచంలా నిలిచినట్లు... చూడగానే మదిదోచేలా ఉంది కదూ ఈ చిత్రం. దొనకొండ మార్గంలో పొదిలి వైపుగా ఉన్న పృథుల గిరులు ఇలా దర్శనమిస్తూ అటుగా వెళ్లేవారిని కనువిందు చేస్తున్నాయి. 
5/7
శివపార్వతుల రూపాల్లోని బొమ్మలను చూశారా.. ఇందులో ఓ వైవిధ్యం దాగుంది. తదేకంగా చూస్తే బొమ్మల మధ్యలో శివ, పార్వతుల స్తోత్రాలు సూక్ష్మంగా రాసి ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు వీటిని అందంగా రూపొందించి ఫొటోఫ్రేమ్‌లు కట్టి భీమవరం మండలం యనమదుర్రులోని శ్రీశక్తీశ్వరాలయంలో అమర్చారు.  
శివపార్వతుల రూపాల్లోని బొమ్మలను చూశారా.. ఇందులో ఓ వైవిధ్యం దాగుంది. తదేకంగా చూస్తే బొమ్మల మధ్యలో శివ, పార్వతుల స్తోత్రాలు సూక్ష్మంగా రాసి ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు వీటిని అందంగా రూపొందించి ఫొటోఫ్రేమ్‌లు కట్టి భీమవరం మండలం యనమదుర్రులోని శ్రీశక్తీశ్వరాలయంలో అమర్చారు.  
6/7
ఈ చిత్రాన్ని చూస్తుంటే అమెరికాలో టోర్నడోలా ఉంది కదూ. కాదండీ.. కారుమేఘాలు కమ్ముకుని కొండలపై వర్షం కురుస్తున్న సమయంలో తీసినది. బెల్లంకొండ మండలం పాపాయపాలెం కొండల వద్ద ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. 
ఈ చిత్రాన్ని చూస్తుంటే అమెరికాలో టోర్నడోలా ఉంది కదూ. కాదండీ.. కారుమేఘాలు కమ్ముకుని కొండలపై వర్షం కురుస్తున్న సమయంలో తీసినది. బెల్లంకొండ మండలం పాపాయపాలెం కొండల వద్ద ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. 
7/7
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున జోలాపుట్టు జలాశయం పరిధిలో విస్తరించి ఉన్న మత్స్యగెడ్డ నిండు గోదావరిలా దర్శనమిస్తోంది. అధిక వర్షాలకు వాగులు, గెడ్డల నుంచి వచ్చే వరదనీరు మత్స్యగెడ్డలో చేరి నదిని తలపిస్తోంది. పచ్చని కొండల మధ్య విస్తరించి ఉన్న గెడ్డ పరివాహక ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. 
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున జోలాపుట్టు జలాశయం పరిధిలో విస్తరించి ఉన్న మత్స్యగెడ్డ నిండు గోదావరిలా దర్శనమిస్తోంది. అధిక వర్షాలకు వాగులు, గెడ్డల నుంచి వచ్చే వరదనీరు మత్స్యగెడ్డలో చేరి నదిని తలపిస్తోంది. పచ్చని కొండల మధ్య విస్తరించి ఉన్న గెడ్డ పరివాహక ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. 
Published : 23 Oct 2025 05:46 IST

మరిన్ని

సుఖీభవ

చదువు