News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 28 Oct 2025 07:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/11
 మన్యంలో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా ప్రయాణికుల్లో, వాహన చోదకుల్లో మార్పు కానరావడం లేదు. ఆటోలు, జీపులపై వేలాడుతూ వెళుతున్నారు. మన్యంలో తగినన్ని రవాణా సదుపాయాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. చింతపల్లి- గూడెంకొత్తవీధి మార్గంలో సోమవారం ఆటోపై వేలాడుతున్న ప్రయాణికులను చిత్రంలో చూడొచ్చు. 
 మన్యంలో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా ప్రయాణికుల్లో, వాహన చోదకుల్లో మార్పు కానరావడం లేదు. ఆటోలు, జీపులపై వేలాడుతూ వెళుతున్నారు. మన్యంలో తగినన్ని రవాణా సదుపాయాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. చింతపల్లి- గూడెంకొత్తవీధి మార్గంలో సోమవారం ఆటోపై వేలాడుతున్న ప్రయాణికులను చిత్రంలో చూడొచ్చు. 
2/11
పొట్టదశలో ఉన్న వరి ధాన్యాన్ని ఆరగించేందుకు పక్షులు చేలల్లో బారులు తీరుతున్నాయి. గాలిలో గింగిరాలు కొడుతూ, కడుపు నిండా వరి గింజలు ఆరగిస్తూ విద్యుత్‌ తీగలపై గుంపులుగా సేదతీరుతున్నాయి. ఆ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలో ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన దృశ్యం ఇది
పొట్టదశలో ఉన్న వరి ధాన్యాన్ని ఆరగించేందుకు పక్షులు చేలల్లో బారులు తీరుతున్నాయి. గాలిలో గింగిరాలు కొడుతూ, కడుపు నిండా వరి గింజలు ఆరగిస్తూ విద్యుత్‌ తీగలపై గుంపులుగా సేదతీరుతున్నాయి. ఆ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలో ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన దృశ్యం ఇది
3/11
 పారా అథ్లెట్, ‘ఈనాడు లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి చిత్రాన్ని హైదరాబాద్‌ గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ పిల్లర్‌పై పెయింటింగ్‌ వేయించారు. పరుగు తీస్తున్నట్లు ఉన్న దీప్తి చిత్రం యువతకు స్ఫూర్తిగా ఉండేలా తీర్చిదిద్దారు. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజి దీప్తి పారిస్‌ పారాలింపిక్స్‌లో టీ-20 400 మీటర్ల పరుగులో కాంస్య పతకం, ఇటీవల ఆస్ట్రేలియాలో ‘విర్టుస్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2025’లో టీ-20 400, 200 మీటర్ల పరుగు విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించారు.
 పారా అథ్లెట్, ‘ఈనాడు లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి చిత్రాన్ని హైదరాబాద్‌ గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ పిల్లర్‌పై పెయింటింగ్‌ వేయించారు. పరుగు తీస్తున్నట్లు ఉన్న దీప్తి చిత్రం యువతకు స్ఫూర్తిగా ఉండేలా తీర్చిదిద్దారు. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజి దీప్తి పారిస్‌ పారాలింపిక్స్‌లో టీ-20 400 మీటర్ల పరుగులో కాంస్య పతకం, ఇటీవల ఆస్ట్రేలియాలో ‘విర్టుస్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2025’లో టీ-20 400, 200 మీటర్ల పరుగు విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించారు.
4/11
  కార్తిక మాసోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీభద్రేశ్వర స్వామికి లక్ష పుష్పార్చన జరిపారు. అంతకుముందు ఉదయం శివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించారు. కార్తిక దీపోత్సవం సందర్భంగా రాత్రి భద్రకాళి ఆలయంలో మహిళలు దీపాలు వెలిగించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశానుసారం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈవో సునీత, ధర్మకర్త వీరన్న, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
  కార్తిక మాసోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీభద్రేశ్వర స్వామికి లక్ష పుష్పార్చన జరిపారు. అంతకుముందు ఉదయం శివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించారు. కార్తిక దీపోత్సవం సందర్భంగా రాత్రి భద్రకాళి ఆలయంలో మహిళలు దీపాలు వెలిగించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశానుసారం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈవో సునీత, ధర్మకర్త వీరన్న, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
5/11
హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి సోమవారం రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు మణికంఠశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు రుద్రేశ్వరుడిని నీలకంఠుడిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయంలో మహిళా భక్తులకు దీపం ప్రమిదలు, వత్తులు, నూనె అందించారు.
హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి సోమవారం రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు మణికంఠశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు రుద్రేశ్వరుడిని నీలకంఠుడిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయంలో మహిళా భక్తులకు దీపం ప్రమిదలు, వత్తులు, నూనె అందించారు.
6/11
7/11
  పాప్‌ సాంగ్స్‌.. సినిమా గెటప్‌లతో కాకతీయ వైద్య కళాశాల(కేఎంసీ) వార్షికోత్సవం ఉత్కర్ష-25లో వైద్య విద్యార్థులు సందడి చేశారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్నివాల్‌ నైట్‌లో సినిమా గెటప్‌లు, సైనికుడు, కార్టూన్‌ పాత్రలు, పిట్టల దొరలాంటి విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్నారు. పాప్‌ పాటలు, సినీ గీతాలతో బ్యాండ్‌ మోత మోగించగా.. సహ విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ఫుడ్‌ ఫెస్టివల్‌ నోరూరించింది. ఉత్తమ వంటకాలు చేసిన విద్యార్థులకు లక్కీ డ్రా తీసి బహుమతులు అందించారు.
  పాప్‌ సాంగ్స్‌.. సినిమా గెటప్‌లతో కాకతీయ వైద్య కళాశాల(కేఎంసీ) వార్షికోత్సవం ఉత్కర్ష-25లో వైద్య విద్యార్థులు సందడి చేశారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్నివాల్‌ నైట్‌లో సినిమా గెటప్‌లు, సైనికుడు, కార్టూన్‌ పాత్రలు, పిట్టల దొరలాంటి విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్నారు. పాప్‌ పాటలు, సినీ గీతాలతో బ్యాండ్‌ మోత మోగించగా.. సహ విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ఫుడ్‌ ఫెస్టివల్‌ నోరూరించింది. ఉత్తమ వంటకాలు చేసిన విద్యార్థులకు లక్కీ డ్రా తీసి బహుమతులు అందించారు.
8/11
 సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండీ పైవంతెన రెయిలింగ్‌కు మొక్కలు మొలిచాయి. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వాటిని మొక్కల దశలోనే తొలగించకుంటే వృక్షాలుగా ఎదిగి పైవంతెన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది.
 సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండీ పైవంతెన రెయిలింగ్‌కు మొక్కలు మొలిచాయి. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వాటిని మొక్కల దశలోనే తొలగించకుంటే వృక్షాలుగా ఎదిగి పైవంతెన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది.
9/11
 నగరంలో ఒంగోలు గిత్త సంచరిస్తున్నట్లుంది కదా.. కానీ ఇది నిజం కాదు. దీపావళి సందర్భంగా నిర్వహించిన సదర్‌ ఉత్సవాల కోసం ర్యాలీలో ప్రదర్శించడానికి నిర్వాహకులు తీసుకొచ్చిన ఆకృతి ఇది. ఉత్సవాల అనంతరం కాచిగూడ చాపెల్‌ బజార్‌లో దీన్ని ఉంచడంతో ఆ మార్గంలో వెళ్లే వారు ఆగి మరీ దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.
 
 నగరంలో ఒంగోలు గిత్త సంచరిస్తున్నట్లుంది కదా.. కానీ ఇది నిజం కాదు. దీపావళి సందర్భంగా నిర్వహించిన సదర్‌ ఉత్సవాల కోసం ర్యాలీలో ప్రదర్శించడానికి నిర్వాహకులు తీసుకొచ్చిన ఆకృతి ఇది. ఉత్సవాల అనంతరం కాచిగూడ చాపెల్‌ బజార్‌లో దీన్ని ఉంచడంతో ఆ మార్గంలో వెళ్లే వారు ఆగి మరీ దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.  
10/11
11/11
 నగరంలోని ఉత్తరాది ప్రజలు సోమవారం ఛఠ్‌పూజ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వేళ టాం్యక్‌బండ్‌కు పెద్దఎత్తున తరలివచ్చిన ఉత్తరాదివాసులు సూర్యభగవానుడిని ఆరాధిస్తూ పండ్లు, ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 
 నగరంలోని ఉత్తరాది ప్రజలు సోమవారం ఛఠ్‌పూజ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వేళ టాం్యక్‌బండ్‌కు పెద్దఎత్తున తరలివచ్చిన ఉత్తరాదివాసులు సూర్యభగవానుడిని ఆరాధిస్తూ పండ్లు, ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 
Published : 28 Oct 2025 07:10 IST

మరిన్ని