APPSC Group 1 Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

APPSC Group 1 Mains Results: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌. మొత్తం 111 గ్రూప్‌ 1 పోస్టులకు గాను 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపికచేశారు.

Published : 14 Jul 2023 17:52 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. మొత్తం 111 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు గాను 259 మందిని  ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్‌ కోటాలో ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఫలితాలను శుక్రవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..

స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని