JEE Main: జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) కీ విడుదల

JEE Main (session-2) Exam: జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది.

Published : 19 Apr 2023 21:27 IST

దిల్లీ: ఏప్రిల్‌ 6 నుంచి 15వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) పరీక్ష ప్రాథమిక కీను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) బుధవారం విడుదల చేసింది. సమాధానాల కీపై అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్‌ 21 సాయంత్రం 5గంటలవరకు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది. ఇందుకుగాను ఒక్కో ప్రశ్నకు రూ.200లు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, ఆ మొత్తం రిఫండ్‌ కాదని తెలిపింది. జేఈఈ మెయిన్‌ (సెషన్‌-2) ఫలితాలు ఏప్రిల్‌ 29న విడుదలయ్యే అవకాశం ఉంది.

జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరగ్గా.. ఇటీవల రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ర్యాంకులు కేటాయించనుంది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్‌ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి ఈనెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలివిడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. రెండో విడత పరీక్షకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా (పేపర్‌-1, 2) వారిలో దాదాపు 9లక్షల మంది వరకు హాజరైనట్టు అంచనా.

కీపై అభ్యంతరాలకు క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని