Cyber Crime: భారత్ లక్ష్యంగా సైబర్ నేరాలు
కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ఏజెంట్లు నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల చొప్పున వసూలు చేశారు. అనంతరం వారిని చైనా, కాంబోడియా కంపెనీలకు చెందిన ఏజెంట్లకు అప్పగించారు.
చైనా ఏజెంట్ల వలలో 5000 మంది భారతీయులు
కాంబోడియా నుంచి రాష్ట్రానికి చేరుకున్న 24 మంది
విశాఖ పోలీసుల చొరవతో బాధితులకు విముక్తి
బాధితులతో కలసి విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సీపీ రవిశంకర్
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్టుడే, గోపాలపట్నం: కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ఏజెంట్లు నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల చొప్పున వసూలు చేశారు. అనంతరం వారిని చైనా, కాంబోడియా కంపెనీలకు చెందిన ఏజెంట్లకు అప్పగించారు. భారతీయులే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడటంపై బాధితులకు సదరు ఏజెంట్లు శిక్షణ ఇచ్చారు. తిరస్కరించినా, ఎదురుతిరిగినా చిత్రహింసలకు గురిచేశారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మానవ అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపిన విశాఖ పోలీసులు.. కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాలశాఖ సహకారంతో కొందరు బాధితులకు విముక్తి కల్పించారు. శుక్రవారం రెండు విమానాల్లో విశాఖ చేరుకున్న 24 మందికి విశాఖ పోలీసు కమిషనర్ రవిశంకర్ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు.
ఏజెంట్లకు నోటీసులు
‘విదేశీ వ్యవహారాలశాఖ, భారత రాయబార కార్యాలయం ప్రతినిధుల సహకారంతో బాధితులను క్షేమంగా రప్పించేందుకు చర్యలు తీసుకున్నాం. తొలి విడతగా ఒక విమానంలో 10 మంది, మరో విమానంలో 14 మంది విశాఖ చేరుకున్నారు. వారు క్షేమంగా ఇళ్లకు చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ జాయింట్ కమిషనర్ డా.ఫకీరప్ప నేతృత్వంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లు, కాంబోడియా ఏజెంట్లకు మధ్య ఒప్పందాల గురించి విచారణలో తెలుస్తుంది. మొత్తం 70 మంది ఏజెంట్లు, సబ్ఏజెంట్లకు నోటీసులు పంపించాం. నిందితులపై చర్యలు తీసుకుంటాం. చైనా ఏజెంట్లు, వారు కొల్లగొట్టిన డబ్బును పంపిన ఖాతాల వివరాలను సేకరిస్తున్నాం. బాధితుల ఫోన్లలో తీసిన చిత్రాలు, సేకరించిన వివరాలతో విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కాంబోడియా ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాం’ అని సీపీ రవిశంకర్ తెలిపారు.
7 నుంచి 10 రోజుల శిక్షణ
విశాఖకు చేరుకున్న బాధితుల నుంచి పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు. వాటి ప్రకారం.. చైనా ఏజెంట్లు తొలుత బాధితుల పాస్పోర్టులు లాగేసుకున్నారు. భారత్పై సైబర్ నేరాలకు ఎలా పాల్పడాలో 7 నుంచి 10 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఫెడెక్స్ కొరియర్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్లో ఉద్యోగ ప్రకటనల పేరిట భారతీయులను ఎలా మోసగించాలో నేర్పించారు. ఇప్పటికే విశాఖ సిటీ నుంచి రూ.120 కోట్లు కొల్లగొట్టారు. తాజాగా ఫెడెక్స్ కొరియర్ పేరిట విశాఖకు చెందిన మహిళ ఖాతా నుంచి రూ.3.2 కోట్లు కొట్టేశారు. భారతీయులను సైబర్ ఉచ్చులోకి దింపి నగదు లాగేస్తున్నారు. వాటిని వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తూ.. క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. కొందరు ఏడాదిగా, మరొకొందరు ఆరు నెలలు, మూడు నెలలుగా కాంబోడియాలో పనిచేస్తున్నారు. చైనా ఏజెంట్ల వలలో దేశవ్యాప్తంగా 5000 మంది చిక్కుకున్నట్లు అంచనా. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 150 మంది, విశాఖకు చెందిన 58 మందిని గుర్తించారు. మరికొంతమంది.. పోలీసులను సంప్రదిస్తున్నారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
చీకటి గదుల్లో బంధించి.. బ్యాట్తో కొట్టి
ఎక్కువ సమయం ఆన్లైన్లో ఉండేవారే లక్ష్యంగా సైబర్ మోసాలకు తెగబడ్డారు. తెలుగు వచ్చిన వారు ఆ భాష వారిని లక్ష్యంగా చేసుకోవాలని బాధిత యువకులపై ఏజెంట్లు ఒత్తిడి చేసేవారు. ఆ నేరాలు చేయలేమని నిరసన తెలిపితే చీకటి గదుల్లో బంధించేవారు. భోజనం కూడా పెట్టకుండా తీవ్రంగా హింసించేవారు. బేస్బాల్ బ్యాట్లతో కొట్టేవారు. పనితీరు సరిగా లేనివారికి, లక్ష్యాన్ని చేరుకోలేనివారికి ఒక పూట మాత్రమే భోజనం పెట్టేవారు. ఎక్కువ మందిని మోసగిస్తే రెండు పూటలా భోజనం పెట్టేవారు. చైనా ఏజెంట్లను మెప్పిస్తే పార్టీలు, బహుమతులు కూడా ఇచ్చేవారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి