AP Fibernet: ఫైబర్నెట్లో లెక్క తేలని అక్రమాలు
విజయవాడలోని ఏపీ ఫైబర్నెట్ కార్యాలయాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది. సిబ్బందికి కూడా కార్యాలయంలోకి అనుమతి నిలిపేసింది. అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు ఇబ్బంది లేకుండా సంబంధిత విభాగాల అధికారులకు ఆన్లైన్ విధానంలో ఇంటి నుంచే పని చేయడానికి అనుమతి ఇచ్చింది.
రూ.950 కోట్లు రుణాలు తెచ్చినా.. సంస్థ అభివృద్ధికి వినియోగించని వైనం
సంస్థ ఎండీ మెయిల్, లాగిన్ ఫ్రీజ్
అక్రమాలపై విచారణకు కమిటీ ఏర్పాటు?
ఈనాడు - అమరావతి: విజయవాడలోని ఏపీ ఫైబర్నెట్ కార్యాలయాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది. సిబ్బందికి కూడా కార్యాలయంలోకి అనుమతి నిలిపేసింది. అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు ఇబ్బంది లేకుండా సంబంధిత విభాగాల అధికారులకు ఆన్లైన్ విధానంలో ఇంటి నుంచే పని చేయడానికి అనుమతి ఇచ్చింది. సంస్థ ఎండీ మధుసూదన్రెడ్డిని విధుల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్కు అప్పగించింది. వైకాపా ప్రభుత్వం కొత్త రుణాలు తీసుకోవడానికి, రాజకీయ నేతల సిఫారసుతో విచ్చలవిడిగా కాంట్రాక్టు సిబ్బంది నియామకాల కోసం ఫైబర్నెట్ను కేంద్రంగా చేసుకుంది. దీనివల్ల సంస్థ భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్లలో ఫైబర్నెట్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేసే ప్రయత్నాలు జరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఐదేళ్లలో 3.2 లక్షల కనెక్షన్ల కోత
2019లో ఉన్న 9.7 లక్షలుగా ఉన్న ఫైబర్నెట్ కనెక్షన్లు సుమారు 45 శాతం తగ్గాయి. వైకాపా ఐదేళ్ల పాలనలో వాటి సంఖ్య క్రమేణా తగ్గుతూ.. ప్రస్తుతం 6.5 లక్షలకు చేరింది. ఫైబర్నెట్ సేవల కోసం వినియోగించే ట్రిపుల్ ప్లే బాక్స్ల మరమ్మతుల కోసం తిరుపతి, విజయవాడ, విశాఖల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను వైకాపా ప్రభుత్వం తొలగించింది. దీంతో పాడైన బాక్సులను పక్కన పడేస్తున్నారు. ఈ కారణంగా సుమారు 3.2 లక్షల కనెక్షన్ల ద్వారా సంస్థకు ప్రతి నెలా వచ్చే ఆదాయం (బేసిక్ ప్యాకేజీ ప్రకారం లెక్కించినా) సుమారు రూ.11.20 కోట్ల వంతున ఏటా రూ.134.40 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. సంస్థ నెట్వర్క్ను పూర్తి స్థాయిలో వినియోగించుకుని అదనంగా మరో 20 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా అధికారులు ఐదేళ్లలో ప్రయత్నించలేదు. 10 లక్షల కొత్త బాక్సుల కొనుగోలుకు ప్రతిపాదన సిద్ధం చేశామంటూనే కాలం గడిపేశారు. కనీసం కొత్తగా 10 లక్షల కనెక్షన్లు ఇచ్చినా.. నెలకు రూ.35 కోట్ల చొప్పున ఏటా రూ.420 కోట్ల ఆదాయం అదనంగా వచ్చేది. సంస్థ ఆదాయాన్ని పెంచే నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నెలకు సుమారు రూ.5 కోట్ల నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు.. ఫైబర్నెట్లో గత ఐదేళ్లలో ఏం జరిగిందని లోతుగా శోధిస్తున్నారు.
అడ్డగోలుగా సిబ్బంది నియామకాలు
ఫైబర్నెట్లో ఎండీతో కలిపి కేవలం ముగ్గురు మాత్రమే పూర్తి స్థాయి సిబ్బంది. నెట్వర్క్ ఇంజినీర్లుగా ప్రతి జిల్లాలో సుమారు 20 నుంచి 30 మందిని కాంట్రాక్టు విధానంలో నియమించారు. వీరే కాక పోల్ స్పైసర్లు, కార్యాలయ అవసరాల కోసం ఐదేళ్లలో సుమారు 1,500 మందిని నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టు సంస్థ ద్వారా చేపట్టిన సిబ్బంది నియామకాల్లోనూ భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో లెక్కలు చూపి జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. జీతాల విషయంలోనూ నిర్దిష్ట విధానాన్ని పాలించడం లేదు. నేతల సిఫారసు ఆధారంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రతి నెలా జీతంగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఎంత మంది సిబ్బందిని నియమించారనే లెక్కలు అందుబాటులో లేవు. ఆ లెక్కల కోసం విజయవాడలోని కేంద్ర కార్యాలయాన్ని సీజ్ చేసినా.. అందులో పనిచేస్తున్న సిబ్బంది ప్రతి రోజూ రిజిస్టర్లో సంతకాలు చేయాలని అధికారులు సూచించారు. జిల్లాల్లోని కార్యాలయాల్లో అక్కడి సిబ్బంది సంతకాలు చేసేలా ఏర్పాటు చేశారు. వాటి ఆధారంగా సంస్థలో పనిచేసే సిబ్బంది ఎంత మంది ఉన్నారో లెక్కలు తేలుస్తామని, ఆ ప్రకారమే ప్రతి నెలా జీతాలు చెల్తిస్తున్నారా అనేది పోల్చి చూస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు అందిన తర్వాత ఏ మేరకు అక్రమాలు జరిగాయనేది గుర్తిస్తామన్నారు.
వందల కోట్ల రుణాలు.. ఏం చేశారు?
ఎన్నికలకు ముందు ఫైబర్నెట్ పేరిట రూ.600 కోట్లు రుణాలు తీసుకున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థ పేరిట రుణాలు తీసుకుని సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణకు అత్యవసరంగా ఖర్చు చేయడంపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తాన్ని గుత్తేదారులకు దోచిపెట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి ఎండీ మధుసూదన్రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అంతకు ముందు సంస్థ నిర్వహణ కోసం తీసుకున్న రూ.350 కోట్ల రుణాన్ని కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినట్లు తెలిసింది. వీటిన్నింటిపై విచారణ చేపడితే భారీ అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఫైబర్నెట్లో అక్రమాలపై కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఆ మేరకు ఉత్తర్వులు వస్తాయని తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఫైబర్నెట్ వ్యవహారాలపై విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. అందులో భాగంగా సంస్థ ఎండీ మెయిల్, లాగిన్లను గత రెండు రోజులుగా ఫ్రీజ్ చేశారు. సంస్థ ఇన్ఛార్జి ఎండీగా పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ శనివారం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ