Andhra Pradesh News: కీలక ఠాణాల్లో ఆగిన సీసీ కెమెరాలు.. ఎన్నికల వేళ మొరాయింపుపై అనుమానాలు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, అనంతరం అధికార వైకాపా పలుచోట్ల అరాచకం సృష్టించింది. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా పాల్వాయిగేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు.
పల్నాడు జిల్లాలో 18 చోట్ల సేవలు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా 340 ఠాణాల్లో ఇదే తీరు
కెమెరాలో దృశ్యాలు హార్డ్ డిస్క్లో రికార్డు కాకుండా కేబుల్ను తొలగించిన తీరు
ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, అనంతరం అధికార వైకాపా పలుచోట్ల అరాచకం సృష్టించింది. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా పాల్వాయిగేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలింగ్ అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై వైకాపా మూకలు మారణాయుధాలతో హత్యాయత్నానికి తెగబడ్డాయి. సీసీ కెమెరాల్లో ఆయా దృశ్యాలను చూసిన యావత్ రాష్ట్రం నెవ్వెరబోయింది. వైకాపా దాష్టీకాలను వెలుగులోకి తీసుకురావడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. ఇంతటి కీలకమైన నిఘా నేత్రాలను పలు పోలీస్ స్టేషన్లలో పోలీసులే పని చేయకుండా స్తంభింపజేస్తున్నారు. వైకాపా పెద్దల ప్రాపకం కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఠాణాల్లో సీసీ కెమెరాలు అమర్చిన ఏజెన్సీలకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. దీంతో గుత్తేదారులు వాటి నిర్వహణను పట్టించుకోవడం మానేశారు. ఉద్దేశపూర్వకంగా బిల్లులు ఆపి, ఈ పరిస్థితులు తలెత్తడానికి పూర్వ డీజీపీ తన శక్తిమేర కృషి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి స్టేషన్కు 12 కెమెరాల వరకు ఏర్పాటు
పోలీసు స్టేషన్లలో విధిగా నిఘా కెమెరాలను బిగించాలని మూడేళ్ల కిందట సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొదటి విడతలో 629 స్టేషన్లు, రెండో దఫా 372 ఠాణాల్లో బిగించారు. ఒక్కో ఠాణాలో 12 కెమెరాల వరకు ఏర్పాటు చేశారు. కొందరు ఉన్నత స్థాయి అధికారుల నుంచి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా పలు స్టేషన్లలో కిందిస్థాయి అధికారులు సీసీ కెమెరాలను పని చేయకుండా చేస్తున్నారు. మరోవపు పలువురు పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని స్టేషన్లకు తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. అవన్నీ నిఘా నేత్రాల్లో నమోదు కాకుండా వారు చేయని ప్రయత్నం లేదు. కొన్నిచోట్ల కెమెరాల వైర్లను తప్పించారు. షార్ట్సర్క్యూట్ అయిందని నమ్మించేందుకు కొన్నిచోట్ల వైర్లకు నిప్పు పెట్టారు. మరికొన్ని స్టేషన్లలో హార్డ్డిస్క్ అనుసంధానాన్ని తొలగించారు.
సీసీ కెమెరా కేబుల్ను కోసేశారిలా…
ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులు ఆపేసిన పూర్వ డీజీపీ?
హింసాత్మక ఘటనలతో రగులుతున్న పల్నాడు జిల్లాలో 13 స్టేషన్లలో సీసీ కెమెరాలు మొరాయించాయి. బెల్లంకొండ, దుర్గి, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, శావల్యాపురం.. తిరుపతి జిల్లా పరిధిలోని తిరుపతి సీసీఎస్, దిశ, ఎస్వీ క్యాంపస్, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట, రామచంద్రాపురం, తదితర ఠాణాల్లో ఆగిపోయాయి. ఇలా.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు దాదాపు 340 స్టేషన్లలో పని చేయడం లేదు. కెమెరాలు ఆగిపోయిన స్టేషన్లలో అధికంగా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నవే కావడం గమనార్హం.
ఆగిపోయిన వాటికి మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ఏటా వార్షిక నిర్వహణ వ్యయం మంజూరు చేస్తుంది. ఈ మొత్తాన్ని కెమెరాలను బిగించిన ఏజెన్సీకి మరమ్మతులు, నిర్వహణ నిమిత్తం వెచ్చించాలి. నిర్వహణ వ్యయం దేవుడెరుగు.. కెమెరాలు బిగించిన బిల్లులు కూడా ఇప్పటికీ గుత్తేదారులకు చెల్లించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇదంతా చేసిందనే విమర్శలున్నాయి. మొదటి దశ బిల్లులు ఇంకా రూ.6 కోట్లు, రెండో విడత బిల్లు రూ.14 కోట్లు చొప్పున మొత్తం రూ.20 కోట్లు విడుదల చేయాలి. దీనిపై గుత్తేదారులు పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి ఆరుసార్లు లేఖలు రాసినా ఆయన స్పందించలేదు. బకాయిలు ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలు పనిచేయకపోయినా ఏజెన్సీలు మరమ్మతులు చేయలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని.. పలువురు వైకాపా నేతలు పోలీసుల సాయంతో గిట్టని వారిపై బెదిరింపులకు దిగారు. సీసీ కెమెరాల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఉంటుంది. అందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి తదితరులు సభ్యులుగా ఉంటారు. ఎన్నికల సమయంలో కీలకమైన అన్ని స్టేషన్లలో నిఘా నేత్రాలు పనిచేయకపోతే వీరంతా ఎందుకు మిన్నకుండిపోయారన్నది తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి...!
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి.. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు. -
పోలవరమే పెను సవాలు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్ వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. -
అధికారం వచ్చిందని.. కక్ష సాధింపులొద్దు
‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
మోసపోయాం.. మన్నించండి
వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. -
విద్యా, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి
రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. -
మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. -
ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. -
రామోజీరావు.. ఒక విశ్వవిద్యాలయం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు. -
ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కసరత్తు
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
బోల్తాపడిన బోధనాసుపత్రులు
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. -
ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. -
చంద్రబాబుకు కళ్లద్దాలిచ్చి.. మురిసిపోయిన మహిళ
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. -
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం
అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీరభ్కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా శనివారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. -
ఇదీ సంగతి!
-
సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. -
కిషన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం. -
ప్రజలకూ నాకూ మధ్య అడ్డుగోడలుండవు
ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. -
పౌరసరఫరాల శాఖలో భారీ దోపిడీ
రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్కు 50-100 గ్రాములు తక్కువ బరువే. -
మహిళలకు రక్షణ కల్పిస్తాం.. రాష్ట్ర హోం మంత్రి అనిత
భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.