Andhra Pradesh News: కీలక ఠాణాల్లో ఆగిన సీసీ కెమెరాలు.. ఎన్నికల వేళ మొరాయింపుపై అనుమానాలు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, అనంతరం అధికార వైకాపా పలుచోట్ల అరాచకం సృష్టించింది. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా పాల్వాయిగేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు.
పల్నాడు జిల్లాలో 18 చోట్ల సేవలు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా 340 ఠాణాల్లో ఇదే తీరు
కెమెరాలో దృశ్యాలు హార్డ్ డిస్క్లో రికార్డు కాకుండా కేబుల్ను తొలగించిన తీరు
ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, అనంతరం అధికార వైకాపా పలుచోట్ల అరాచకం సృష్టించింది. మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా పాల్వాయిగేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. పోలింగ్ అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై వైకాపా మూకలు మారణాయుధాలతో హత్యాయత్నానికి తెగబడ్డాయి. సీసీ కెమెరాల్లో ఆయా దృశ్యాలను చూసిన యావత్ రాష్ట్రం నెవ్వెరబోయింది. వైకాపా దాష్టీకాలను వెలుగులోకి తీసుకురావడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. ఇంతటి కీలకమైన నిఘా నేత్రాలను పలు పోలీస్ స్టేషన్లలో పోలీసులే పని చేయకుండా స్తంభింపజేస్తున్నారు. వైకాపా పెద్దల ప్రాపకం కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఠాణాల్లో సీసీ కెమెరాలు అమర్చిన ఏజెన్సీలకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు. దీంతో గుత్తేదారులు వాటి నిర్వహణను పట్టించుకోవడం మానేశారు. ఉద్దేశపూర్వకంగా బిల్లులు ఆపి, ఈ పరిస్థితులు తలెత్తడానికి పూర్వ డీజీపీ తన శక్తిమేర కృషి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రతి స్టేషన్కు 12 కెమెరాల వరకు ఏర్పాటు
పోలీసు స్టేషన్లలో విధిగా నిఘా కెమెరాలను బిగించాలని మూడేళ్ల కిందట సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొదటి విడతలో 629 స్టేషన్లు, రెండో దఫా 372 ఠాణాల్లో బిగించారు. ఒక్కో ఠాణాలో 12 కెమెరాల వరకు ఏర్పాటు చేశారు. కొందరు ఉన్నత స్థాయి అధికారుల నుంచి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా పలు స్టేషన్లలో కిందిస్థాయి అధికారులు సీసీ కెమెరాలను పని చేయకుండా చేస్తున్నారు. మరోవపు పలువురు పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని స్టేషన్లకు తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. అవన్నీ నిఘా నేత్రాల్లో నమోదు కాకుండా వారు చేయని ప్రయత్నం లేదు. కొన్నిచోట్ల కెమెరాల వైర్లను తప్పించారు. షార్ట్సర్క్యూట్ అయిందని నమ్మించేందుకు కొన్నిచోట్ల వైర్లకు నిప్పు పెట్టారు. మరికొన్ని స్టేషన్లలో హార్డ్డిస్క్ అనుసంధానాన్ని తొలగించారు.
సీసీ కెమెరా కేబుల్ను కోసేశారిలా…
ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులు ఆపేసిన పూర్వ డీజీపీ?
హింసాత్మక ఘటనలతో రగులుతున్న పల్నాడు జిల్లాలో 13 స్టేషన్లలో సీసీ కెమెరాలు మొరాయించాయి. బెల్లంకొండ, దుర్గి, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, శావల్యాపురం.. తిరుపతి జిల్లా పరిధిలోని తిరుపతి సీసీఎస్, దిశ, ఎస్వీ క్యాంపస్, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట, రామచంద్రాపురం, తదితర ఠాణాల్లో ఆగిపోయాయి. ఇలా.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు దాదాపు 340 స్టేషన్లలో పని చేయడం లేదు. కెమెరాలు ఆగిపోయిన స్టేషన్లలో అధికంగా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నవే కావడం గమనార్హం.
ఆగిపోయిన వాటికి మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ఏటా వార్షిక నిర్వహణ వ్యయం మంజూరు చేస్తుంది. ఈ మొత్తాన్ని కెమెరాలను బిగించిన ఏజెన్సీకి మరమ్మతులు, నిర్వహణ నిమిత్తం వెచ్చించాలి. నిర్వహణ వ్యయం దేవుడెరుగు.. కెమెరాలు బిగించిన బిల్లులు కూడా ఇప్పటికీ గుత్తేదారులకు చెల్లించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇదంతా చేసిందనే విమర్శలున్నాయి. మొదటి దశ బిల్లులు ఇంకా రూ.6 కోట్లు, రెండో విడత బిల్లు రూ.14 కోట్లు చొప్పున మొత్తం రూ.20 కోట్లు విడుదల చేయాలి. దీనిపై గుత్తేదారులు పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి ఆరుసార్లు లేఖలు రాసినా ఆయన స్పందించలేదు. బకాయిలు ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలు పనిచేయకపోయినా ఏజెన్సీలు మరమ్మతులు చేయలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని.. పలువురు వైకాపా నేతలు పోలీసుల సాయంతో గిట్టని వారిపై బెదిరింపులకు దిగారు. సీసీ కెమెరాల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఉంటుంది. అందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి తదితరులు సభ్యులుగా ఉంటారు. ఎన్నికల సమయంలో కీలకమైన అన్ని స్టేషన్లలో నిఘా నేత్రాలు పనిచేయకపోతే వీరంతా ఎందుకు మిన్నకుండిపోయారన్నది తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి