YSRCP: లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములు కొట్టేసే కుట్ర
అధికారం నుంచి దిగిపోయినా తాము, తమ తర్వాత కొన్ని తరాలపాటు అనుభవించడానికి వీలుగా ఎసైన్డ్ భూములపై వైకాపా ప్రభుత్వం గతేడాది ఓ దురాలోచనకు ఒడిగట్టింది.
20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్టసవరణ చేసిన వైకాపా సర్కారు
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంచి జరుగుతుందనే ముసుగులో దోపిడీ
సవరణ జీవో అడ్డం పెట్టుకుని.. బరితెగించిన వైకాపా ముఠాలు
రాయలసీమలో పెద్దఎత్తున దోపిడీ.. ఉత్తరాంధ్రనూ ఊడ్చేస్తున్నారు
కొత్త ప్రభుత్వం వచ్చాక సిట్ ఏర్పాటు చేసి విచారించాలి
ఈనాడు-అమరావతి, విశాఖపట్నం
అధికారం నుంచి దిగిపోయినా తాము, తమ తర్వాత కొన్ని తరాలపాటు అనుభవించడానికి వీలుగా ఎసైన్డ్ భూములపై వైకాపా ప్రభుత్వం గతేడాది ఓ దురాలోచనకు ఒడిగట్టింది. 20 ఏళ్లకు ముందు (2003కు ముందు) ఇచ్చిన ఎసైన్డ్ భూముల్ని అమ్ముకునేందుకు వీలు కల్పించడం ద్వారా ఆయా వర్గాల పేదల్ని ఉద్ధరిస్తున్నామంటూ చట్టసవరణ చేసింది. ఈ సవరణ జీవో జారీకి ముందే ముఖ్య అధికారులు, వైకాపా నాయకులు ఒక్కో ప్రాంతంలో వందల ఎకరాల ఎసైన్డ్ భూముల కొనుగోలుకు భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సవరణ ఉత్తర్వును అడ్డం పెట్టుకుని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూ.లక్షల కోట్ల దోపిడీకి తెరతీసిన అతిపెద్ద భూ కుంభకోణం ఇది. ఒక్క ఉత్తర్వు ద్వారా సుమారు 25 లక్షల ఎకరాలకు పైగా ఎసైన్డ్ భూముల్ని పేదల నుంచి లాగేసుకునే కుట్ర ఇది. వ్యవసాయ యోగ్యం కాని, పట్టణాల్లోకి చేరిన భూముల్ని అమ్ముకుంటే పేద కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. ఆ మంచిని ముసుగుగా చూపించి, వైకాపా నేతలు, వారి అనుయాయులే లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు, వారి బంధువులే ఈ భూముల్ని రాయించుకుంటున్నట్లు తెలిసింది. బినామీ పేర్లతో రాయలసీమ ప్రాంతంలో పెద్దఎత్తున భూముల్ని దోచుకున్న ఈ పెద్దలు.. ఇప్పుడు ఉత్తరాంధ్రపై వాలిపోయారు. భారీ ఎత్తున భూములు చేతులు మారాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా మరింత భూమిని హస్తగతం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. కొత్త ప్రభుత్వం దీనిపై సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ జరిపిస్తే, సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది బయటికి వస్తుంది.
ఉత్తరాంధ్రలో భారీ ఒప్పందాలు
596 జీవో అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాయలసీమ సహా పలుచోట్ల ఎసైన్డ్ భూముల కుంభకోణం జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా రూ.వేల కోట్ల విలువైన ఎసైన్డ్ భూముల కుంభకోణం ఉత్తరాంధ్రను కుదిపేస్తోంది. ఇందులో కొందరు అధికారుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. భోగాపురం, విశాఖ పరిధిలోని ఎసైన్డ్ భూముల జాబితాలు దగ్గర పెట్టుకుని.. వారి దగ్గర నుంచి సుమారు వెయ్యి ఎకరాల వరకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. భోగాపురం పరిధిలో బసవపాలెం గ్రామంలో 62 మంది రైతుల నుంచి 45 ఎకరాలను రూ.10 లక్షల చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జీవో 596 విడుదల కాకముందే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి ఎసైన్డ్ భూములు అగ్రిమెంట్ చేసుకుని.. సవరణ జీవో వచ్చాక పది రోజుల్లోనే ఆఘమేఘాలపై రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆధారాలు బయటకొచ్చాయి. విశాఖ జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి సమీపంలోని పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాలతోపాటు, విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో ఈ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. అర్హులైన పేదల ఎసైన్డ్ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడం, కీలక అధికారులు ఒప్పందాలు చేసుకున్న భూములకు సంబంధించిన సర్వే నంబర్లకు మాత్రమే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు మంజూరు చేయడమూ అనుమానాలకు తావిస్తోంది. విశాఖ జిల్లా పరిధిలో సుమారు 2వేల ఎకరాల ఎసైన్డ్ భూములున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ఆనందపురం, పద్మనాభం పరిధిలో మొదటి విడతగా సుమారు 367 సర్వే నంబర్లలో ఉన్న భూమిని ఫ్రీ హోల్డ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉండగానే ఆనందపురంలో 22 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తూ మరో జాబితా పంపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఇందులో అసలు వ్యక్తులు ఎవరనేది బయటకు వస్తుంది.
సర్కారు లెక్కలన్నీ తప్పుల తడకలే
రాష్ట్రంలో ఎసైన్డ్ భూములెంత, వాటిలో 2003కు ముందు ఇచ్చిన భూములెన్ని అనే వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోంది. కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం 1969 నవంబరు 1 నుంచి 2001 మార్చి 31 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 42 లక్షల ఎకరాలకు పైగా ఎసైన్డ్ భూములు పంపిణీ చేయగా.. అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినవే 26 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి. గతేడాది ఇచ్చిన జీవో ప్రకారం ఇవన్నీ అమ్ముకునేందుకు వీలు కల్పించినట్లే. అంటే రాష్ట్రంలో 20% భూములపై పేదలకున్న హక్కులు దూరం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2003 సంవత్సరానికి ముందు ఇచ్చిన భూములు 9.94 లక్షల ఎకరాలే అని.. వాటిని అమ్ముకునేందుకు వీలుంటుందని పేర్కొంటోంది. 29.62 లక్షల ఎకరాలకు శాశ్వత హక్కులు కల్పించొచ్చని లెక్కలు చెబుతోంది. అందులో 16 లక్షల ఎకరాలకు సంబంధించిన ఎసైన్డ్ భూముల్లో యజమానులు/ వారసులు లేరని వివరిస్తోంది. అన్యాకాంత్రమైన భూముల్లో చాలా వరకు ఎసైన్డ్ కేటగిరిలోనే లేవు. సుమారు 7 లక్షల ఎకరాలకు సంబంధించి భూముల రికార్డుల్లో అనుభవదారు/వారసుల పేర్లు లేవు. మరో 30 వేల ఎకరాలు ఎవరివో తెలియని పరిస్థితి. కొన్ని భూములు చెరువులు, కుంటల కింద నమోదై ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి, గార్లదిన్నె, ధర్మవరం, ఉమ్మడి కడప జిల్లా కాశినాయన, కలసపాడు, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, ఉమ్మడి కృష్ణా జిల్లా అయినంపూడి, ఇలపర్రు, పోలకొండ, నందివాడ, ఏలూరు జిల్లా దోసపాడు తదితర ప్రాంతాల్లో ఎసైన్డ్ భూములు అర్హులైన దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని గిరిజనుల్లో 50% మంది లబ్ధిదారులు మాత్రమే భూమిని అనుభవిస్తున్నారు.
మూడంచెల విధానాన్ని పక్కనపెట్టి..
ఎసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు మూడంచెల విధానంలో (వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీఓ) పరిశీలించి నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చట్టప్రకారం ఫ్రీహోల్డ్కు అర్హమైన ఎసైన్డ్ భూముల పరిశీలనను 100% వీఆర్వోలు, 100% తహశీల్దార్లు, ర్యాండమ్గా 10% ఆర్డీఓలు నిర్వహించాలి. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. బీఎస్ఓ (బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్)ను సవరించాలి. ఈ విధానం సరిగా అమలు కావడం లేదు. 20 ఏళ్ల అనుభవం లేకున్నా.. ఉన్నట్లు రికార్డులు సృష్టించి, కొందరు వైకాపా నేతలు లబ్ధిపొందుతున్నారు.
వేళ్లన్నీ.. త్రిమూర్తులవైపే!
ఇరవై ఏళ్ల కంటే ముందు ఎసైన్ చేసిన వ్యవసాయ భూములు, 10 ఏళ్ల కంటే ముందు పంచిన ఇళ్ల స్థలాలను అమ్ముకునే హక్కు కల్పిస్తూ.. 2023 జులై 31 నుంచి అమల్లోకి వచ్చేలా చట్టసవరణ చేస్తూ గతేడాది అక్టోబరు 27న వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 596 డిసెంబరు 19న విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు ఉన్నతాధికారులు చక్రం తిప్పి ఈ జీవో జారీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుపెట్టుకుని.. ఎసైన్డ్ భూములపై ఆధారపడి తరతరాలుగా బతుకుతున్న వర్గాలకు తృణమో, పణమో ముట్టచెప్పి అక్కడి నుంచి తరిమేస్తున్నారు. అంగీకరించకపోతే బెదిరించి, భయపెట్టి లాక్కుంటున్నారు. విశాఖ వంటిచోట్ల పేదలకు గతంలో ఇచ్చిన భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటిచోట్ల 50- 70% వరకు భూములు అధికార పార్టీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. విశాఖ, ఉమ్మడి కృష్ణా, కడప, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన దళితుల భూములదీ ఇదే పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్