Andhra Pradesh post poll violence: హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది.
పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ
పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్
12 మంది పోలీసు అధికారులపైనా కొరడా
హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు
రెండురోజుల్లోపు నివేదిక ఇవ్వాలి
కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
ఫలితాలొచ్చిన రెండు వారాల వరకు కేంద్ర బలగాల గస్తీ
కేంద్ర హోం శాఖకు ఆదేశం
సీఎస్, డీజీపీల సంజాయిషీ అనంతరం చర్యలు
మీడియాతో మాట్లాడకుండా వెనుక గేట్లోంచి వెళ్లిపోయిన పోలీస్, ప్రభుత్వ బాస్లు
ఈనాడు - దిల్లీ
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ను సస్పెండ్ చేసిన ఈసీ.. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్లపై బదిలీ వేటు వేసింది. ఈ మూడు జిల్లాలకు చెందిన 12 మంది కిందిస్థాయి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ 16 మందిపైనా శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 3 గంటల్లోగా వారిపై ఛార్జిషీట్ వేయాలని స్పష్టం చేసింది. వారిపై శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తిచేసి.. తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని సూచించింది. తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని, శాఖాపరమైన చర్యలు నిలిపివేయకూడదని పేర్కొంది. సస్పెండైన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ అయిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ స్థానంలో అర్హులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేర్లతో జాబితాను 17న ఉదయం 11 గంటల్లోగా పంపాలని సూచించారు. ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను.. ఫలితాలు వెలువడిన తర్వాత 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.
ఈసీ ఎదుట హాజరైన సీఎస్, డీజీపీ
పోలింగ్ జరిగిన సమయంలో, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం పరిశీలకులు ఇచ్చిన నివేదికలు, మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్ గుప్తాలను దిల్లీకి పిలిపించి వివరణ కోరింది. వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30కు సీఈసీ రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేష్కుమార్, సుఖ్బీర్సింగ్ సంధుల ముందు హాజరయ్యారు. హింసాత్మక ఘటనలను నిలువరించకపోవడాన్ని కారణమేంటి? అందుకు బాధ్యులెవరు? రాష్ట్రంలో 14 సమస్యాత్మక అసెంబ్లీ స్థానాలను గుర్తించినా అక్కడ జరగబోయే ఘటనలను ఊహించడంలో ఎందుకు విఫలమయ్యారు? అల్లర్ల నివారణకు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు? అని ఎన్నికల కమిషనర్లు వారిద్దరిని ప్రశ్నించి వివరాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం తొలి నుంచి అసంతృప్తితో ఉంది. అందుకే డీజీపీ సహా పలువురు ఐపీఎస్ అధికారులు, డీఎస్పీ, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులనూ బదిలీ చేసింది. ఈసీ ఇంత అప్రమత్తంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎందుకు హింసాత్మక ఘటనలను నిలువరించలేకపోయారని ఎన్నికల కమిషనర్లు వీరిని ప్రశ్నించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలోనే చోటుచేసుకున్న ఘటనలపట్ల ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశానంతరం ఇద్దరు అధికారులూ మీడియాతో మాట్లాడకుండా కమిషన్ భవనం వెనుక గేటు నుంచి బయటికెళ్లిపోయారు.
తీవ్ర అసంతృప్తి.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి
వీరి నుంచి తీసుకున్న వివరణలు, వివరాలను అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం రాత్రి 8 గంటలకు ఈ మూడు జిల్లాలకు చెందిన 16 మంది అధికారులపై కొరడా ఝళిపిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీఈసీ రాజీవ్కుమార్, కమిషనర్లు సీఎస్, డీజీపీలతో సమావేశమైన సందర్భంగా ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలంతా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ అధికారులను కమిషనర్లు గట్టిగా ఆదేశించినట్లు వెల్లడించింది. నిందితులపై సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈ పని పూర్తిచేయాలని నిర్దేశించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను ఎన్నికల కమిషనర్లకు వివరించే సమయంలో సీఎస్, డీజీపీలు ఇద్దరూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జిల్లాల్లో ఏయే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎవరి పర్యవేక్షణ లోపం కారణంగా ఇవి చోటుచేసుకున్నాయో వివరణ ఇచ్చారు. దాని ఆధారంగా ఈసీ ఈ అధికారులపై చర్యలకు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు?
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును రాష్ట్రానికి సాధించేలా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
మండల కేంద్రాలు, పట్టణాల్లో రిమోట్ వర్క్ స్టేషన్లు: చంద్రబాబు
‘‘మన విద్యార్థులు, యువత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలని భావిస్తున్నాం. ఇంట్లో ఉంటూ పనిచేసుకునే రిమోట్ ఉద్యోగాలు అందుబాటులో ఉంటే చదువుకుంటూనే పనిచేసుకునే వీలుంటుంది. -
ఏపీలో పరదాల సంస్కృతికి తెర!
తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన పరదాలను అధికారులు తొలగించారు. గత సీఎం జగన్ పర్యటన సందర్భంగా పరదాలు ఏర్పాటు చేసేవారు. -
ఏపీలో డిసెంబరులోగా ఉపాధ్యాయ నియామకాలు.. త్వరలో ప్రకటన
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం ఆ దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. -
రూ. 100 కోట్లతో ఆడుకున్నారు!.. మాజీమంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు
‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్’ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సీఐడీకి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ తెలిపారు. -
16,347 ఉపాధ్యాయ పోస్టులు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో గల ఛాంబర్లో గురువారం సాయంత్రం 4.41 గంటలకు ఆయన వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు తీసుకున్నారు. -
వీసీఐసీ ప్రాజెక్టు పనుల పూర్తికి గడువు పెంపు
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) మొదటిదశ పనులను పూర్తిచేయడానికి మరో ఆరు నెలలు గడువు పెంచడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) అంగీకరించింది. -
అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారు
రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తంచేశారు. -
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తారా?
రాజకీయ నేతల పునరావాస కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)ను కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. -
వాసుదేవరెడ్డికి హైకోర్టు షాక్
జగన్ ప్రభుత్వ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. -
పింఛనుదారులపై వరాల జల్లు
పింఛనుదారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. పేద వర్గాల మోములో చిరునవ్వులు పూయించేలా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత పింఛన్ల పెంపు దస్త్రంపై సంతకం చేశారు. -
గిరిజన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమానికి రాష్ట్రపతికి ఆహ్వానం
ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులను ప్రోత్సహించేందుకు త్వరలో దిల్లీలో తాము నిర్వహించబోతున్న కార్యక్రమానికి రావాలని ఏపీ భాజపా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి రాష్ట్రపతి ద్రౌపదీముర్మును కోరారు. -
కూటమి విజయంపై కొలరాడోలో విజయోత్సవం
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని కొలరాడోలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. -
అమరావతి రూపశిల్పికి అపూర్వ స్వాగతం
నిప్పులు చెరిగే ఎండను లెక్క చేయలేదు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోతను ఖాతరు చేయలేదు.. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి రూపశిల్పి చంద్రబాబు కోసం రైతులు, మహిళలు, యువత వేల మంది రోడ్డుపైకి వచ్చారు. -
శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దంపతులు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో గోయల్ దంపతులు, రాష్ట్ర మంత్రి నారాయణ మహద్వారం గుండా ఆలయానికి చేరుకున్నారు. -
దుర్గమ్మ సేవలో సీఎం చంద్రబాబు దంపతులు
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు గురువారం దర్శించుకున్నారు. -
విలువల శిఖరం రామోజీరావు
రామోజీగ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు, మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్లు నివాళి అర్పించారు. -
చంద్రబాబుకు రెడ్ కార్పెట్ స్వాగతం
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఉద్యోగులు బారులు తీరారు. -
యువతలో ఏం నైపుణ్యాలున్నాయి?
రాష్ట్రంలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్)-2024 చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
నా మనసును హత్తుకున్నావ్.. నారా రోహిత్ పోస్టుపై చంద్రబాబు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తన సోదరుడి కుమారుడు, నటుడు నారా రోహిత్ రాసిన లేఖపై సీఎం చంద్రబాబు స్పందించారు. -
సర్వే రాళ్ల వెనుక పెద్ద కుట్ర!
జగన్ ప్రభుత్వంలో ఏ పథకం చేపట్టినా దాని వెనుక స్వప్రయోజనాలు ఉన్నట్లు ఇప్పటికే అనేక అంశాల్లో బయటపడింది. తాజాగా సర్వేరాళ్ల వెనుక నడిచిన కథ బయటికొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా
-
‘కాళేశ్వరం’పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్
-
కువైట్ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్