Andhra Pradesh post poll violence: హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది.
పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ
పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్
12 మంది పోలీసు అధికారులపైనా కొరడా
హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు
రెండురోజుల్లోపు నివేదిక ఇవ్వాలి
కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు
ఫలితాలొచ్చిన రెండు వారాల వరకు కేంద్ర బలగాల గస్తీ
కేంద్ర హోం శాఖకు ఆదేశం
సీఎస్, డీజీపీల సంజాయిషీ అనంతరం చర్యలు
మీడియాతో మాట్లాడకుండా వెనుక గేట్లోంచి వెళ్లిపోయిన పోలీస్, ప్రభుత్వ బాస్లు
ఈనాడు - దిల్లీ
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ను సస్పెండ్ చేసిన ఈసీ.. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్లపై బదిలీ వేటు వేసింది. ఈ మూడు జిల్లాలకు చెందిన 12 మంది కిందిస్థాయి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ 16 మందిపైనా శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 3 గంటల్లోగా వారిపై ఛార్జిషీట్ వేయాలని స్పష్టం చేసింది. వారిపై శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తిచేసి.. తదుపరి చర్యల కోసం సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని సూచించింది. తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని, శాఖాపరమైన చర్యలు నిలిపివేయకూడదని పేర్కొంది. సస్పెండైన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ అయిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ స్థానంలో అర్హులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేర్లతో జాబితాను 17న ఉదయం 11 గంటల్లోగా పంపాలని సూచించారు. ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను.. ఫలితాలు వెలువడిన తర్వాత 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది.
ఈసీ ఎదుట హాజరైన సీఎస్, డీజీపీ
పోలింగ్ జరిగిన సమయంలో, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం పరిశీలకులు ఇచ్చిన నివేదికలు, మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్ గుప్తాలను దిల్లీకి పిలిపించి వివరణ కోరింది. వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30కు సీఈసీ రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేష్కుమార్, సుఖ్బీర్సింగ్ సంధుల ముందు హాజరయ్యారు. హింసాత్మక ఘటనలను నిలువరించకపోవడాన్ని కారణమేంటి? అందుకు బాధ్యులెవరు? రాష్ట్రంలో 14 సమస్యాత్మక అసెంబ్లీ స్థానాలను గుర్తించినా అక్కడ జరగబోయే ఘటనలను ఊహించడంలో ఎందుకు విఫలమయ్యారు? అల్లర్ల నివారణకు ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు? అని ఎన్నికల కమిషనర్లు వారిద్దరిని ప్రశ్నించి వివరాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం తొలి నుంచి అసంతృప్తితో ఉంది. అందుకే డీజీపీ సహా పలువురు ఐపీఎస్ అధికారులు, డీఎస్పీ, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులనూ బదిలీ చేసింది. ఈసీ ఇంత అప్రమత్తంగా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎందుకు హింసాత్మక ఘటనలను నిలువరించలేకపోయారని ఎన్నికల కమిషనర్లు వీరిని ప్రశ్నించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలోనే చోటుచేసుకున్న ఘటనలపట్ల ఈసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశానంతరం ఇద్దరు అధికారులూ మీడియాతో మాట్లాడకుండా కమిషన్ భవనం వెనుక గేటు నుంచి బయటికెళ్లిపోయారు.
తీవ్ర అసంతృప్తి.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి
వీరి నుంచి తీసుకున్న వివరణలు, వివరాలను అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం రాత్రి 8 గంటలకు ఈ మూడు జిల్లాలకు చెందిన 16 మంది అధికారులపై కొరడా ఝళిపిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీఈసీ రాజీవ్కుమార్, కమిషనర్లు సీఎస్, డీజీపీలతో సమావేశమైన సందర్భంగా ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలంతా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ అధికారులను కమిషనర్లు గట్టిగా ఆదేశించినట్లు వెల్లడించింది. నిందితులపై సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈ పని పూర్తిచేయాలని నిర్దేశించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను ఎన్నికల కమిషనర్లకు వివరించే సమయంలో సీఎస్, డీజీపీలు ఇద్దరూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జిల్లాల్లో ఏయే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎవరి పర్యవేక్షణ లోపం కారణంగా ఇవి చోటుచేసుకున్నాయో వివరణ ఇచ్చారు. దాని ఆధారంగా ఈసీ ఈ అధికారులపై చర్యలకు ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ