అక్టోబరు నెల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల రేపు

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను గురువారం ఉదయం 9గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల

Updated : 17 Aug 2022 05:51 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం అక్టోబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను గురువారం ఉదయం 9గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఎస్‌ఈడీ టికెట్ల కోటాను రద్దుచేసి సర్వదర్శనానికే భక్తులను అనుమతిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు ఎస్‌ఈడీ టికెట్ల కోటా ఉండదు. భక్తులు మిగిలిన తేదీల్లో టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని తితిదే అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని