దేశానికి దిక్సూచి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 11.43 శాతం జీడీపీ వృద్ధిరేటుతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని, ప్రతి రంగాన్నీ అభివృద్ధి చేయడం వల్లే ఇది సాధ్యమై... రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు.
11.43 శాతం వృద్ధి రేటుతో తొలిస్థానం
పల్నాడు జిల్లా వినుకొండ సభలో సీఎం జగన్
‘జగనన్న చేదోడు’ మూడో విడత నిధుల విడుదల
రజక, దర్జీ, నాయీబ్రాహ్మణులకు రూ.330 కోట్ల సాయం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 11.43 శాతం జీడీపీ వృద్ధిరేటుతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని, ప్రతి రంగాన్నీ అభివృద్ధి చేయడం వల్లే ఇది సాధ్యమై... రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు. జగన్ పరిపాలన వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అబద్ధాలాడుతూ విమర్శలు చేసేవారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది రజక, దర్జీ, నాయీబ్రాహ్మణులకు ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మూడో విడత రూ.330.15 కోట్ల సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదలకు మేలుచేసేలా అమలు చేస్తూ అడుగులు వేస్తున్నామన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా మూడేళ్లలో రూ.927 కోట్లను నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 43 నెలల కాలంలో వివిధ పథకాల ద్వారా బటన్ నొక్కి రూ.1,92,938 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని గుర్తుచేశారు. గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, విద్యాకానుక వంటి పథకాలను కలుపుకొంటే... రూ.3 లక్షల కోట్ల సాయం చేయగలిగామన్నారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నా వాళ్లుగా భావించి... ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాని విధంగా అభివృద్ధి చేస్తున్నాం. గిట్టనివాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. మీరంతా ఆలోచించాలి’ అని ప్రజలను సీఎం కోరారు.
ఈ పోరాటంలో మీ దీవెనలు కావాలి
‘ఇచ్చిన మాటమీద నిలబడే జగన్కు.. వెన్నుపోట్లు, మోసాలకు పాల్పడేవారికి ఈరోజు యుద్ధం జరగబోతోంది. ఈ పోరాటంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేదలను నమ్ముకున్నాను. మీ చల్లని దీవెనలు కావాలి’ అని సీఎం కోరారు. పొత్తులు లేకుండా, ఎవరిమీదా ఆధారపడకుండా ఒక్కడినే సింహంలా నడుస్తుంటే... తోడేళ్లందరూ కలిసి వస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ... గతంలో నాయకుడంటే మోసం... నేడు నాయకుడంటే నమ్మకం అనేలా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసి జీవితాలకు భరోసా ఇస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం బటన్ నొక్కి జగనన్న చేదోడు నిధులను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు.
దుకాణాల్లేవు... బస్సులు రావు
వినుకొండ, న్యూస్టుడే: సీఎం పర్యటనను పురస్కరించుకొని వినుకొండలో సోమవారం మధ్యాహ్నం వరకు దుకాణాలు మూయించారు. స్తూపం కూడలి నుంచి వెల్లటూరు రోడ్డులోని సభా ప్రాంగణం దాకా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు అడ్డంగా కట్టారు. తోపుడుబండ్లనూ అనుమతించలేదు. సీఎం వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేదాకా ఈ రహదారిలో వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు. బహిరంగ సభా ప్రాంగణం చాలక జనం బయట నిలబడాల్సి వచ్చింది. లోపలున్న పలువురు అసౌకర్యంతో సీఎం ప్రసంగం ముగియక ముందే వెనుదిరిగారు. ప్రవేశ ద్వారాల నుంచి పోలీసులు అనుమతించనప్పటికీ బారికేడ్లు దాటుకొని వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్