దేశానికి దిక్సూచి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 11.43 శాతం జీడీపీ వృద్ధిరేటుతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని, ప్రతి రంగాన్నీ అభివృద్ధి చేయడం వల్లే ఇది సాధ్యమై... రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు.
11.43 శాతం వృద్ధి రేటుతో తొలిస్థానం
పల్నాడు జిల్లా వినుకొండ సభలో సీఎం జగన్
‘జగనన్న చేదోడు’ మూడో విడత నిధుల విడుదల
రజక, దర్జీ, నాయీబ్రాహ్మణులకు రూ.330 కోట్ల సాయం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 11.43 శాతం జీడీపీ వృద్ధిరేటుతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని, ప్రతి రంగాన్నీ అభివృద్ధి చేయడం వల్లే ఇది సాధ్యమై... రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు. జగన్ పరిపాలన వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అబద్ధాలాడుతూ విమర్శలు చేసేవారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది రజక, దర్జీ, నాయీబ్రాహ్మణులకు ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున మూడో విడత రూ.330.15 కోట్ల సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదలకు మేలుచేసేలా అమలు చేస్తూ అడుగులు వేస్తున్నామన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా మూడేళ్లలో రూ.927 కోట్లను నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 43 నెలల కాలంలో వివిధ పథకాల ద్వారా బటన్ నొక్కి రూ.1,92,938 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని గుర్తుచేశారు. గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, విద్యాకానుక వంటి పథకాలను కలుపుకొంటే... రూ.3 లక్షల కోట్ల సాయం చేయగలిగామన్నారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నా వాళ్లుగా భావించి... ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాని విధంగా అభివృద్ధి చేస్తున్నాం. గిట్టనివాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. మీరంతా ఆలోచించాలి’ అని ప్రజలను సీఎం కోరారు.
ఈ పోరాటంలో మీ దీవెనలు కావాలి
‘ఇచ్చిన మాటమీద నిలబడే జగన్కు.. వెన్నుపోట్లు, మోసాలకు పాల్పడేవారికి ఈరోజు యుద్ధం జరగబోతోంది. ఈ పోరాటంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేదలను నమ్ముకున్నాను. మీ చల్లని దీవెనలు కావాలి’ అని సీఎం కోరారు. పొత్తులు లేకుండా, ఎవరిమీదా ఆధారపడకుండా ఒక్కడినే సింహంలా నడుస్తుంటే... తోడేళ్లందరూ కలిసి వస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ... గతంలో నాయకుడంటే మోసం... నేడు నాయకుడంటే నమ్మకం అనేలా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసి జీవితాలకు భరోసా ఇస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం బటన్ నొక్కి జగనన్న చేదోడు నిధులను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు.
దుకాణాల్లేవు... బస్సులు రావు
వినుకొండ, న్యూస్టుడే: సీఎం పర్యటనను పురస్కరించుకొని వినుకొండలో సోమవారం మధ్యాహ్నం వరకు దుకాణాలు మూయించారు. స్తూపం కూడలి నుంచి వెల్లటూరు రోడ్డులోని సభా ప్రాంగణం దాకా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు అడ్డంగా కట్టారు. తోపుడుబండ్లనూ అనుమతించలేదు. సీఎం వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేదాకా ఈ రహదారిలో వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు. బహిరంగ సభా ప్రాంగణం చాలక జనం బయట నిలబడాల్సి వచ్చింది. లోపలున్న పలువురు అసౌకర్యంతో సీఎం ప్రసంగం ముగియక ముందే వెనుదిరిగారు. ప్రవేశ ద్వారాల నుంచి పోలీసులు అనుమతించనప్పటికీ బారికేడ్లు దాటుకొని వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..