Food Prices: ఈ బాదుడుకు.. పేదలు బతికేదెలా?
నాలుగేళ్లలో పెరిగిన నిత్యావసరాల ధరల వల్ల ఒక్కో కుటుంబంపై నెలకు రూ.3,400 వరకు భారం పడింది. అంటే వంటింటి బడ్జెట్ ఏడాదికి రూ.40,800 పెరిగింది.
ఒక్కో కుటుంబంపై నాలుగేళ్లలో రూ.1.63 లక్షల భారం
పెరుగుతున్న బియ్యం, కూరగాయల ధరలు
వంటగ్యాస్ నుంచి పచారీ సరకుల వరకు అన్నీ మంటలే
భారీగా పెరిగిన వంటింటి ఖర్చు
ఈనాడు - అమరావతి
నాలుగేళ్లలో పెరిగిన నిత్యావసరాల ధరల వల్ల ఒక్కో కుటుంబంపై నెలకు రూ.3,400 వరకు భారం పడింది. అంటే వంటింటి బడ్జెట్ ఏడాదికి రూ.40,800 పెరిగింది. పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పరిశీలిస్తే.. నాలుగేళ్లకు రూ. 12,800 బాదేశారు. ‘మీ బిడ్డ పాలనలో..’ అంటూ కుడిచేత్తో వడ్డిస్తూ, ఎడమచేత్తో విదిలిస్తూ పేదల నడ్డి విరగ్గొట్టడంలో జగన్ను మించిన నాయకుడు ఎవరుంటారు?
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుల జేబులను గుల్ల చేస్తున్నాయి. టమాటా కిలో రూ.100 దాటేసింది. పచ్చిమిర్చి అంతకు మించిపోయింది. కందిపప్పు కిలో కొనాలంటే రూ.150 పైమాటే. బియ్యం ధరలు బరువెక్కుతున్నాయి. వంటగ్యాస్ వెలిగించకముందే మండిపోతోంది.. పెరిగిన సిలిండర్ ధరలతో నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై రూ.12,800 చొప్పున అదనపు భారం పడింది. నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతుండటంతో.. పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్ రాకెట్ తీరున దూసుకెళ్తోంది. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే పప్పుల ధరలు 30% నుంచి 70% వరకు పెరిగాయి. నాణ్యమైన సన్న బియ్యం రేటు ఏడాదిలోనే 20% ఎగసింది. కరోనా, ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో మండిన నూనెల ధరలు తరవాత కాస్త దిగొచ్చినా.. ఇంకా సలసల మరుగుతూనే ఉన్నాయి. కూరగాయల ధరలు 100% నుంచి 200% వరకు ఎగశాయి. మొత్తంగా చూస్తే నాలుగేళ్లలో పేదల వంటింటి బడ్జెట్ 60% పెరిగింది. ఒక్కో కుటుంబంపై నెలకు రూ.3,400 పైగా అదనపు భారం పడుతోంది. ధరల భారం భరించలేక నిరుపేదలు కుంగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.పైగా వారిని మరింత కష్టాల్లోకి నెట్టేస్తోంది. రాయితీపై రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే సరకుల్లోనూ కోత పెట్టి.. సహనాన్ని పరీక్షిస్తోంది.
పప్పు వండాలన్నా వందనోటు ఒక్కటే చాలదు..!
పచారీ సరుకుల ధరల భారీగా పెరిగాయి. కందిపప్పు గత నాలుగైదు నెలల్లోనే కిలోకు రూ.50కి పైగా పెరిగింది. బియ్యం ధర మునుపెన్నడూ లేని స్థాయికి చేరడం గమనార్హం. నాణ్యమైన సన్నబియ్యాన్ని కిలో రూ.57 నుంచి రూ.58కి కొనాల్సి వస్తోంది. మధ్యస్థ రకం బియ్యం కొనాలన్నా కిలో రూ.50 వరకు ఉంది. పామోలిన్, పొద్దుతిరుగుడు నూనెల ధరలు కొంతమేర తగ్గినా.. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే భారీగా పెరిగాయి. లీటరు వంటనూనె కొనాలంటే రూ.100 నోటు ఒక్కటే సరిపోదు. పంచదార, బెల్లం ధరలు కూడా సగటున 20% వరకు పెరిగాయి. బ్రాండెడ్ కంపెనీల బియ్యం, పప్పులు, నూనెలు కొనాలంటే కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు అధికంగా పలుకుతున్నాయి. గోధుమపిండి, ఇడ్లీరవ్వ, ఉప్మారవ్వ, ఇతర సరకుల ధరలూ సగటున 30% పైనే పెరిగాయి. టీ, కాఫీ పొడుల ధరలూ కిలోకు రూ.150 వరకు ఎగశాయి. పచ్చజొన్నల ధరలు కిలో రూ.90కి చేరాయి.
* కోడి మాంసం ధర ఇటీవలి వరకు కిలో రూ.320కి చేరింది. ప్రస్తుతం కిలోకు రూ.80 వరకు తగ్గాయి. కోడి గుడ్డు ధర రూ.6 వరకు చేరింది.
ట‘మోత’.. ఘాటెక్కిన పచ్చిమిర్చి
కిలోల లెక్కన కూరలు కొనడం కష్టమే. గతంలో రూ.100 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు కిలో టమాటా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉత్పత్తి తగ్గిపోవడంతో.. టమాటా ధర అంతకంతకూ పెరుగుతోంది. కిలో రూ.120 కి చేరింది. పచ్చిమిర్చి ధర కూడా వారం వ్యవధిలోనే రూ.80కి పైగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.150 పైనే పలుకుతోంది. పట్టణాల్లోని కొన్ని మాల్స్, ఆన్లైన్లో అయితే కిలో రూ.280 వరకు ఉండటం గమనార్హం.
చిరు వ్యాపారులు తెచ్చే గేదె పాలు లీటరు రూ.90పైనే ఉన్నాయి. నాలుగేళ్లలో వీటి ధర లీటరుకు రూ.30పైగా పెరిగింది.
వంటింటికి మసాలా ఘాటు
సుగంధ ద్రవ్యాల ధరలూ పరుగులు తీస్తున్నాయి. కరోనా తర్వాత ప్రతి ఇంట్లోనూ అల్లం వాడకం పెరిగింది. ఫిబ్రవరిలో కిలో రూ.60 నుంచి రూ.70 మధ్య పలికిన అల్లం.. మార్చి నెలాఖరుకు రూ.100పైగా చేరింది. అక్కడ నుంచి రూ.250 వరకు చేరింది. కొన్నిచోట్ల ఇంకా ఎక్కువే పలుకుతోంది. కారంపొడి ధర ఏకంగా 150% నుంచి 200% వరకు పెరిగింది. పచ్చళ్లకు ఉపయోగించే కారం అయితే మరింత ఘాటెక్కింది. వెల్లుల్లి రేటు కూడా 20% వరకు పెరిగింది.
* టీ, కాఫీపొడి ధరలు గతంతో పోలిస్తే పెరిగాయి.
వంటగ్యాస్.. నాలుగేళ్లకు రూ.12,800 బాదుడు
వంటగ్యాస్ ఎంత తక్కువగా వినియోగించినా ప్రతి ఇంటికీ ఏడాదికి కనీసం 8 సిలిండర్లు అవసరమవుతాయి. ఒక్కో సిలిండర్ ధర నాలుగేళ్ల కిందట రూ.541 ఉండగా.. ఇప్పుడు రూ.1,109 అయింది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల రూ.1,150 నుంచి రూ.1,175 పైమాటే. అంటే 2019 జులై నాటితో పోలిస్తే సిలిండర్పై రూ.568 పెరిగింది. సగటున సిలిండర్పై రూ.400 చొప్పున ధర పెరిగిందనుకున్నా నాలుగేళ్లకు ఒక్కో కుటుంబం నుంచి రూ.12,800 చొప్పున లాగేస్తున్నారు.
పేదలపై కనికరం చూపని జగన్
రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మరేమీ దొరకడం లేదని ఎన్నికల ముందు నిర్వహించిన ప్రతి సభలోనూ.. వైకాపా అధినేత జగన్ చెప్పారు. తాను ముఖ్యమంత్రి కాగానే.. అప్పటి వరకు రేషన్ కార్డులపై అందించే నిత్యావసరాలకు కోత పెట్టారు. 2019 జూన్ వరకు ఒక్కో కార్డుపై రెండు కిలోల కందిపప్పు, అరకిలో పంచదార, ఉప్పు, గోధుమపిండి, జొన్నలు, రాగులు రాయితీపై అందించేవారు. కందిపప్పును రెండు కిలోల నుంచి కిలోకు కుదించారు. కిలో ధర రూ.40 నుంచి రూ.67కి పెంచారు. అవికూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. సగటున 30% మంది కార్డుదారులకూ అందడం లేదు. జూన్, జులైలో అయితే పంపిణీ పూర్తిగా నిలిపేశారు. మార్కెట్లో కిలో రూ.160 చొప్పున కొనుక్కోమని చెప్పి పేదల గోడు పట్టించుకోవడమే మానేశారు. పంచదార ధరనూ అరకిలోకు రూ.10 చొప్పున పెంచారు. గోధుమపిండిని ఇటీవలే ప్రారంభించినా.. అదీ పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. జొన్నలు, రాగులు కూడా గత నెల నుంచే ప్రారంభించి కొన్ని ప్రాంతాల్లోనే ఇస్తున్నారు.
* 2019 వరకు రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రోత్సాహకాలు అందించారు. రక్షిత సేద్య విధానంలో కూరగాయ పంటల సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైతులకు హైబ్రిడ్ కూరగాయ విత్తనాలను రాయితీపై అందించడంతోపాటు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకునేవారు. అయితే నాలుగేళ్లుగా ఉద్యానరంగానికి ప్రోత్సాహకాలే అందడం లేదు. దీనికితోడు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. మొత్తంగా ధరలు పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ