అంతా ప్రచార యావ!
కాలుష్య నియంత్రణతో పాటు, ఇంధన వినియోగం ద్వారా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు విద్యుత్తు వాహనాల (ఎలక్ట్రిక్ వెహికిల్స్ - ఈవీ) వాడకం ప్రత్యామ్నాయ మార్గంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు.
విద్యుత్తు వాహనాలకు ప్రోత్సాహం ఉత్తిదే!
జాడలేని ఛార్జింగ్ కేంద్రాలు
జగన్ సర్కారులో రెండేళ్లుగా ముందుకు పడని అడుగులు
ఈనాడు - అమరావతి
కాలుష్య నియంత్రణతో పాటు, ఇంధన వినియోగం ద్వారా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు విద్యుత్తు వాహనాల (ఎలక్ట్రిక్ వెహికిల్స్ - ఈవీ) వాడకం ప్రత్యామ్నాయ మార్గంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ విద్యుత్తు వాహనాల వినియోగం పెంచాలన్న లక్ష్యం అంతగా విజయవంతం కాలేదు. కానీ విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామనే పేరుతో పైసా ఖర్చు లేకుండా ప్రచారం పొందడంపై మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాస్తవానికి ఈవీల వినియోగానికి ప్రోత్సాహం.. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు అందించడం వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశమే లేదు. కేవలం ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి.. వాటి ద్వారా ఈ సేవలు అందుబాటులోకి వచ్చేలా సమన్వయం చేస్తే చాలు. కానీ దీన్ని పూర్తి చేయడమూ గత రెండేళ్లుగా ప్రభుత్వానికి సాధ్యం కావడంలేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 500 విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కేవలం ప్రచార ఆర్భాటంగా మారిపోయాయి.
ప్రోత్సాహం లేక నిరుత్సాహం
ప్రస్తుతం కేవలం ద్విచక్ర వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు మాత్రమే అక్కడక్కడా అందుబాటులో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఉంటేనే ఈవీలు కొనే వారి సంఖ్య పెరుగుతుంది. మరోవైపు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం రాయితీలేవీ ఇవ్వడం లేదు. ఛార్జింగ్ చేస్తే యూనిట్ విద్యుత్తుకు రూ.20 చొప్పున వసూలుకు అనుమతించగా, ఇందులో టారిఫ్ రూ.10, స్థలం అద్దె, ఇతరాలకు రూ.3 వ్యయమవుతోంది. దీంతో కేంద్రం నిర్వాహకులకు మిగిలేది రూ.7 మాత్రమే. ప్రస్తుతం వాహనాల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆదాయం పెద్దగా రాదనే కారణంతో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఉద్యోగులకు దక్కని ఈవీ భాగ్యం
ఈవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉద్యోగులకు ఏడాదిలో లక్ష విద్యుత్తు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం 2021 జులైలో ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతను నెడ్క్యాప్కు అప్పగించింది. వాహన కొనుగోలు మొత్తాన్ని 24 నుంచి 60 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. ప్రతి నెలా పెట్రోలు ఖర్చుతో వాయిదా చెల్లించవచ్చని ప్రచారం చేసింది. ఈ పథకం అమలుకు నెడ్క్యాప్ ప్రత్యేకంగా యాప్ రూపొందించి నానా హడావుడి చేసింది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేలా బ్యాంకులతోనూ సంప్రదింపులు జరిపింది. ఇంత చేసినా ఇప్పటివరకు వంద వాహనాలకు మించి ఇవ్వకపోవడం గమనార్హం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాదుడు
విద్యుత్తు వాహనాల కొనుగోలుదారులకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రం షాకిచ్చాయి. ఈవీల కొనుగోలుపై కేంద్రం రాయితీని తగ్గిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం జీవితపన్ను మినహాయింపును తొలగించింది. దీంతో వాహనాల ధరలు భారంగా మారాయి. విద్యుత్తు వాహనాల కొనుగోలులో కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)-2 పథకం కింద 2018 నుంచి అయిదేళ్లపాటు 15 నుంచి 40 శాతం రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి 15 శాతానికి పరిమితం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈవీల రిజిస్ట్రేషన్లో 2018 నుంచి అయిదేళ్లపాటు 12 శాతం జీవితపన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ 7వ తేదీతో ముగిసింది. మినహాయింపు కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని రవాణాశాఖ కోరినా సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో జూన్ 8 నుంచి విద్యుత్తు వాహనాల రిజిస్ట్రేషన్కు జీవిత పన్ను వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 60 వేల ఈవీలు ఉండగా, ఏటా సగటున 20 వేల కొత్త ఈవీల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా బైక్లే ఉంటున్నాయి.
లక్ష్యం
రాష్ట్రంలో జాతీయ రహదారి వెంట ప్రతి 25 కి.మీ.లకు ఒకటి చొప్పున మొత్తం 250 విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. 2023 సంవత్సరంలో నగరాల్లో ద్విచక్ర వాహనాల కోసం మరో 250 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం కార్పొరేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో స్థలాలను గుర్తించాం. ప్రైవేటు వ్యక్తులు.. సంస్థలతో పాటు ఆర్టీసీ బస్టాండ్లు.. ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోనూ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతిస్తాం.
విద్యుత్తు వాహనాలకు ప్రోత్సాహంపై ప్రభుత్వం తరచూ చెప్పే మాటలివి.
నిర్లక్ష్యం
ప్రభుత్వం చెప్పినట్లు జాతీయ రహదారి వెంట ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన అడుగు ముందుకు పడలేదు. జాతీయ రహదారుల వెంట ప్రతి 100 కి.మీలకు ఒక ఛార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేసినా.. విద్యుత్తు వాహనాల్లో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగంగా ఉంటుంది. ఈమేరకు సంప్రదింపులు జరపగా.. ఐవోసీ పెట్రోలు బంకుల్లో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అంగీకరించిందని, ‘ఛార్జింగ్ బే’లు.. స్లాట్ బుకింగ్ సేవలు వస్తాయని అధికారులు చెప్పారు. కానీ గత రెండేళ్లుగా ఇవేవీ కార్యరూపం దాల్చలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ