పథకం ప్రకారమే ఓట్ల జంబ్లింగ్!
ఓటర్ల జాబితాను జంబ్లింగ్ చేయడం.. ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో కేంద్రానికి మార్చడం.. ఒక ఇంట్లోనివారి ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో వచ్చేలా చేయడం.. సున్నా ఇంటి నంబర్లతో ఓట్ల నమోదు.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతున్న అంశాలివి.
తప్పులున్నా సరిదిద్దని యంత్రాంగం
బందరులో బట్టబయలైన మంత్రాంగం
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
ఈనాడు - అమరావతి
ఓటర్ల జాబితాను జంబ్లింగ్ చేయడం.. ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో కేంద్రానికి మార్చడం.. ఒక ఇంట్లోనివారి ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో వచ్చేలా చేయడం.. సున్నా ఇంటి నంబర్లతో ఓట్ల నమోదు.. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతున్న అంశాలివి. లోతుగా పరిశీలిస్తే ఇదంతా చాలా ప్రణాళికాబద్ధంగా.. పక్కా పథకం ప్రకారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఎన్నికల సంఘం నిబంధన (రూల్ 6) ప్రకారం ఇంటి నంబర్ల వరుస క్రమంలో ఓటర్ల జాబితా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నియమాన్ని పాటించడం లేదు. అంటే.. అర్హులైన ఓటర్లను జాబితాలోంచి తొలగిస్తూ.. అనర్హులను చేర్చుతున్నారని అర్థమవుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంలో ఇలాంటి ఉదంతంపై బందరు వాసి ఇమడాబత్తిని దిలీప్కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను చేర్పించే కార్యక్రమం, ఇతర పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియ ఇలాగే ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు.
ఇదీ ప్రణాళిక..
సాధారణంగా వీధిలో ఇంటి నంబర్లు ఒక వరుసలో ఉంటాయి. ఓటర్ల జాబితాలో కూడా అలాగే ఉండాలి. రూల్ 6 కూడా అదే చెబుతోంది. కానీ ప్రస్తుత జాబితాలో చాలా వరకు డోర్ నంబరు ఒకటి తర్వాత 40 లేదా 50ఉంటోంది. ఆ నంబరు గురించి 1వ నంబరు ఇంట్లో విచారణ చేస్తే.. తమకు తెలియదని చెబుతారు. దీంతో ఆ ఓట్లను తొలగించేస్తారు.. ఇదీ దొంగ ఓట్ల ఆపరేషన్ తీరు.
- దిలీప్కుమార్ మొదట ఓటర్ల జాబితాలో అవకతవకలపై 2022 డిసెంబరు 6న నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన ఆర్డీఓకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. మొత్తం 1,140 ఓట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేరోజు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ప్రతిని అందించారు. దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- 2022 డిసెంబరు 8న ఓటర్ల జాబితా ముసాయిదా పూర్తయింది. కానీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో తిరిగి ఆయన ఫిబ్రవరి 15న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. రాష్ట్ర ఎన్నికల అధికారి కృష్ణా కలెక్టర్కు దానిని ఎండార్సు చేశారు.
- దీనిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ రాజాబాబు ఆర్డీఓ కిశోర్ను 2023 మార్చి 8న ఆదేశించారు. అదేవిధంగా అభ్యంతరాలను బల్క్గా ఇవ్వడం వల్ల తాము ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోలేదంటూ దిలీప్కు లేఖ రాశారు. ఆయన మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి స్పందన లేదు.
- కలెక్టర్, ఆర్డీఓ స్పందించకపోవడంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. జూన్ 19న కోర్టు దాన్ని స్వీకరించింది. దీంతో అదేరోజు సీఈఓ మీడియా సమావేశం నిర్వహించి తాము ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. వాస్తవానికి జూన్ 1 నుంచే ఎస్ఎస్ఆర్ జరుగుతోంది.
- జూన్ 28న హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో మచిలీపట్నంలో 1,140 ఓట్ల విషయంలో తప్పులు జరిగినట్లు ఆర్డీఓ అంగీకరించారు.
- ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని సీఈఓ ముఖేష్కుమార్ మీనా జిల్లా కలెక్టర్ రాజాబాబుకు ఆదేశాలు జారీ చేశారు. అయినా చర్యలు లేవు.
అభ్యంతరాలు ఇవీ..
బందరు ఓటర్ల జాబితాలో ఎక్కడా ఇంటి నంబర్లు క్రమపద్ధతిలో లేవు. ఒక పోలింగ్ కేంద్రంలో ఉండాల్సిన ఓట్లు వేరే కేంద్రానికి మారాయి. ఇలాంటి ఓట్లు 455 ఉన్నట్లు దిలీప్కుమార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 68 ఇంటి నంబర్లు తప్పుల తడకగా ఉన్నట్లు గుర్తించారు. జాబితాలో ఇచ్చిన చిరునామాలో నివాసం ఉండని వారు 386 మంది ఉన్నారు. రెండుసార్లు నమోదైన ఓట్లు రెండు ఉండగా.. చనిపోయినా 24 మందిని జాబితాలోంచి తొలగించలేదని గుర్తించారు. అయినా బాధ్యులపై చర్యలు లేకపోవడంపై దిలీప్కుమార్ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్