సీఐడీ ప్రశ్నలకు లోకేశ్ సూటి సమాధానాలు!
అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూటిగా సమాధానమిచ్చినట్లు తెలిసింది.
50 ప్రశ్నలూ ఒకేసారి ఇస్తే అన్నింటికీ జవాబు చెబుతానని స్పష్టీకరణ
ఈనాడు, అమరావతి: అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూటిగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మినహా దాదాపు ఆరు గంటల పాటు డీఎస్పీ విజయ్భాస్కర్ ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ ఆయన స్పష్టంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు పదే పదే బయటకు వెళ్లి ఫోన్కాల్స్ మాట్లాడుతూనే ఉన్నట్లు సమాచారం. ఒకానొక దశలో ప్రశ్నలు అడిగేందుకు సీఐడీ అధికారులు తర్జనభర్జన పడగా.. మొత్తం 50 ప్రశ్నలు ఒకేసారి ఇస్తే అన్నింటికీ జవాబులు చెబుతానని లోకేశ్ వారితో అన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేశ్ను సీఐడీ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలు, ఆయన సమాధానాలివీ..
సీఐడీ: తెదేపాలో, ప్రభుత్వంలో ఏయే పదవులు చేపట్టారు? హెరిటేజ్ ఫుడ్స్లో ఏ బాధ్యతలు నిర్వహించారు?
లోకేశ్: తెదేపాలో కార్యకర్తల సంక్షేమ నిధి వ్యవహారాలు చూశాను. కార్యకర్తలు అనారోగ్యం బారిన పడినప్పుడు అండగా ఉండటం, స్వయం ఉపాధికి తోడ్పాటు అందివ్వటం వంటివి చేశాను. తర్వాత తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టా. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా. పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా పనిచేశా. 2008-13 వరకూ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా, 2013-17 వరకు స్వతంత్ర డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించా.
హెరిటేజ్ ఫుడ్స్లో పనిచేసిన కాలంలో ఆ సంస్థ మీకు ఎంత చెల్లించేది?
ఈడీగా పనిచేసినప్పుడు వేతనంతో పాటు లాభాలపై కమీషన్, ఇతర సౌకర్యాలు కల్పించారు. స్వతంత్ర డైరెక్టర్గా ఉన్నప్పుడు.. బోర్డు మీటింగ్కు హాజరైనందుకు సిటింగ్ ఫీజు చెల్లించేవారు. 2017 మార్చి 31 నుంచి హెరిటేజ్లో అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నా. ప్రస్తుతం షేర్ హోల్డర్ను మాత్రమే.
హెరిటేజ్ సంస్థలో వ్యక్తిగతంగా మీకు ఎంత వాటా ఉంది?
సుమారు 10 శాతం.
మంత్రివర్గ ఉపసంఘంలో మీరు సభ్యులుగా ఉన్నారా? ఉంటే మీతోపాటు సభ్యులుగా ఉన్న ఇతర మంత్రులెవరు?
మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా ఉన్నాను. యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు ఇతర సభ్యులు.
మీరు నివసించే ఇంటికి సంబంధించిన వివరాలు చెప్పగలరా?
హైదరాబాద్లో మాకు సొంతిల్లు ఉంది. ఉండవల్లిలో ప్రస్తుతం నివసిస్తున్న ఇంటికి మా అమ్మ అద్దె చెల్లిస్తున్నారు.
లింగమనేని సంస్థ స్థలాన్ని తీసుకున్నారా? దానికి చెల్లింపులు చేశారా?
తెదేపా కేంద్ర కార్యాలయ భవనాన్ని ఆనుకుని లింగమనేని సంస్థకు ఉన్న కొంత స్థలాన్ని వాస్తు అవసరాల కోసం కొన్నాం. దానికి సొమ్ము చెల్లించాం.
హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి విధాన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు?
విధాన నిర్ణయాలన్నీ బోర్డు తీసుకుంటుంది. మేనేజ్మెంట్ కమిటీకి నిర్ణయాలు తీసుకునే అధికారాలుండవు.
కంతేరులో హెరిటేజ్ సంస్థ కొన్న భూముల వివరాలు చెప్పండి?
2014 మార్చి 21న హెరిటేజ్ బోర్డు తీర్మానం మేరకు కంతేరులో ఆ సంస్థ భూమి కొనుగోలు చేసింది. భూమి కొనడానికి రూ.3 కోట్లు కేటాయించాలని ఆ తీర్మానంలోనే నిర్ణయించారు. వ్యాపార విస్తరణ కోసం రాజస్థాన్, హరియాణా, అనంతపురం, చిత్తూరు, ఉప్పల్, బయ్యవరం, పామర్రు (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా)ల్లో భూములు కొనాలని బోర్డు తీర్మానించింది. కంతేరులో కొన్న భూమిలో 4.55 ఎకరాలు వివాదంలో ఉందని భావించి రిజిస్ట్రేషన్ చేసుకున్న విక్రయ దస్తావేజులను రద్దు చేసుకున్నాం. కంతేరులో ప్రస్తుతం హెరిటేజ్కు 9.67 ఎకరాలే ఉంది.
జీవో నంబరు 282 ద్వారా రాజధాని ప్రాంతంలో లేఅవుట్ రిజిస్ట్రేషన్ నుంచి 99 మందికి ఎందుకు మినహాయింపు ఇచ్చారు?
ఆ 99 మంది కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలనే పాటించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయాన్ని ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు తప్పని నిరూపించారు. -
నేడు ఐప్యాక్ కార్యాలయానికి జగన్
వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సందర్శించనున్నారు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. -
అసలేం జరుగుతోంది?.. ఏఎన్యూ స్ట్రాంగ్రూం సమీపంలో నిఘా వర్గాల సమావేశం
పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్రూంల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. తిరుపతిలో స్ట్రాంగ్రూంను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. -
రాజంపేట నుంచి వచ్చి మరీ అరాచకం
ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కొనసాగుతున్న వైకాపా ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే అధికారి అయిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
సుప్రీం చెప్పినా.. మేమెందుకు వింటాం!
‘‘ప్రతివాది సమర్పించిన ఫొటోల్లో తేదీలు, సమయం, అక్షాంశాలు, రేఖాంశాలు చూస్తే.. యంత్రాలతో ఇసుక తవ్వకాలను జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినప్పటికీ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తోంది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
జెన్కో థర్మల్ కేంద్రాలకు ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ బొగ్గు
పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) నుంచి హైగ్రేడ్ బొగ్గును జెన్కో తీసుకుంటోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా కృష్ణపట్నం థర్మల్ యూనిట్లో వినియోగించనుంది. -
పర్యాటక సేవలు మరింత ఖరీదు!
పర్యాటకుల కోసం కొత్తగా అనేక అదనపు సౌకర్యాలు కల్పించి ఆకట్టుకోవాల్సిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. -
రాష్ట్ర పునర్విభజన అంశాలపై నివేదికలు రూపొందించండి
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. -
అసలైన ప్రజాసేవకుడు కాటన్
నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహకరించకపోయినా.. పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట, కాలువలు నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. -
పోలీసు వలయంలో పల్నాడు
రెండురోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పల్నాడు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. -
ఆ నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక బలగాలు
పోలింగ్ తర్వాత హింస చెలరేగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
పోలింగ్ తర్వాత.. నిప్పు రాజేస్తోందెవరు?
పోలింగ్ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండను నియంత్రించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
సంక్షిప్త వార్తలు (8)
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం పెంచడానికి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) షెడ్యూల్ ప్రకటించిందని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
117 నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే పోస్టల్ బ్యాలట్లతో కలిపి 2.09% పెరిగింది. మొత్తం 3.33 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైనే పోలింగ్
రాష్ట్రంలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఒంగోలు లోక్సభ పరిధిలో 87.06% మంది ఓటర్లు కదం తొక్కారు. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
-
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ గెలుపు
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్