సీఐడీ ప్రశ్నలకు లోకేశ్ సూటి సమాధానాలు!
అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూటిగా సమాధానమిచ్చినట్లు తెలిసింది.
50 ప్రశ్నలూ ఒకేసారి ఇస్తే అన్నింటికీ జవాబు చెబుతానని స్పష్టీకరణ
ఈనాడు, అమరావతి: అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూటిగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మినహా దాదాపు ఆరు గంటల పాటు డీఎస్పీ విజయ్భాస్కర్ ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ ఆయన స్పష్టంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు పదే పదే బయటకు వెళ్లి ఫోన్కాల్స్ మాట్లాడుతూనే ఉన్నట్లు సమాచారం. ఒకానొక దశలో ప్రశ్నలు అడిగేందుకు సీఐడీ అధికారులు తర్జనభర్జన పడగా.. మొత్తం 50 ప్రశ్నలు ఒకేసారి ఇస్తే అన్నింటికీ జవాబులు చెబుతానని లోకేశ్ వారితో అన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేశ్ను సీఐడీ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలు, ఆయన సమాధానాలివీ..
సీఐడీ: తెదేపాలో, ప్రభుత్వంలో ఏయే పదవులు చేపట్టారు? హెరిటేజ్ ఫుడ్స్లో ఏ బాధ్యతలు నిర్వహించారు?
లోకేశ్: తెదేపాలో కార్యకర్తల సంక్షేమ నిధి వ్యవహారాలు చూశాను. కార్యకర్తలు అనారోగ్యం బారిన పడినప్పుడు అండగా ఉండటం, స్వయం ఉపాధికి తోడ్పాటు అందివ్వటం వంటివి చేశాను. తర్వాత తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టా. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా. పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా పనిచేశా. 2008-13 వరకూ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా, 2013-17 వరకు స్వతంత్ర డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించా.
హెరిటేజ్ ఫుడ్స్లో పనిచేసిన కాలంలో ఆ సంస్థ మీకు ఎంత చెల్లించేది?
ఈడీగా పనిచేసినప్పుడు వేతనంతో పాటు లాభాలపై కమీషన్, ఇతర సౌకర్యాలు కల్పించారు. స్వతంత్ర డైరెక్టర్గా ఉన్నప్పుడు.. బోర్డు మీటింగ్కు హాజరైనందుకు సిటింగ్ ఫీజు చెల్లించేవారు. 2017 మార్చి 31 నుంచి హెరిటేజ్లో అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నా. ప్రస్తుతం షేర్ హోల్డర్ను మాత్రమే.
హెరిటేజ్ సంస్థలో వ్యక్తిగతంగా మీకు ఎంత వాటా ఉంది?
సుమారు 10 శాతం.
మంత్రివర్గ ఉపసంఘంలో మీరు సభ్యులుగా ఉన్నారా? ఉంటే మీతోపాటు సభ్యులుగా ఉన్న ఇతర మంత్రులెవరు?
మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా ఉన్నాను. యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు ఇతర సభ్యులు.
మీరు నివసించే ఇంటికి సంబంధించిన వివరాలు చెప్పగలరా?
హైదరాబాద్లో మాకు సొంతిల్లు ఉంది. ఉండవల్లిలో ప్రస్తుతం నివసిస్తున్న ఇంటికి మా అమ్మ అద్దె చెల్లిస్తున్నారు.
లింగమనేని సంస్థ స్థలాన్ని తీసుకున్నారా? దానికి చెల్లింపులు చేశారా?
తెదేపా కేంద్ర కార్యాలయ భవనాన్ని ఆనుకుని లింగమనేని సంస్థకు ఉన్న కొంత స్థలాన్ని వాస్తు అవసరాల కోసం కొన్నాం. దానికి సొమ్ము చెల్లించాం.
హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి విధాన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు?
విధాన నిర్ణయాలన్నీ బోర్డు తీసుకుంటుంది. మేనేజ్మెంట్ కమిటీకి నిర్ణయాలు తీసుకునే అధికారాలుండవు.
కంతేరులో హెరిటేజ్ సంస్థ కొన్న భూముల వివరాలు చెప్పండి?
2014 మార్చి 21న హెరిటేజ్ బోర్డు తీర్మానం మేరకు కంతేరులో ఆ సంస్థ భూమి కొనుగోలు చేసింది. భూమి కొనడానికి రూ.3 కోట్లు కేటాయించాలని ఆ తీర్మానంలోనే నిర్ణయించారు. వ్యాపార విస్తరణ కోసం రాజస్థాన్, హరియాణా, అనంతపురం, చిత్తూరు, ఉప్పల్, బయ్యవరం, పామర్రు (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా)ల్లో భూములు కొనాలని బోర్డు తీర్మానించింది. కంతేరులో కొన్న భూమిలో 4.55 ఎకరాలు వివాదంలో ఉందని భావించి రిజిస్ట్రేషన్ చేసుకున్న విక్రయ దస్తావేజులను రద్దు చేసుకున్నాం. కంతేరులో ప్రస్తుతం హెరిటేజ్కు 9.67 ఎకరాలే ఉంది.
జీవో నంబరు 282 ద్వారా రాజధాని ప్రాంతంలో లేఅవుట్ రిజిస్ట్రేషన్ నుంచి 99 మందికి ఎందుకు మినహాయింపు ఇచ్చారు?
ఆ 99 మంది కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలనే పాటించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ