Taneti Vanitha: హోంమంత్రిని గంటన్నరపాటు రోడ్డుపైనే నిలబెట్టిన గ్రామస్థులు
దళిత యువకుడు బొంతా మహేంద్ర (23) ఆత్మహత్యతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సొంత నియోజకవర్గంలో ఘెరావ్ చేసిన దొమ్మేరు వాసులు
మిమ్మల్ని గెలిపించినందుకు చావును బహుమతిగా ఇస్తారా?
ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడి బంధువుల నిలదీత
బాధితుల్ని పరామర్శించకుండానే వెనుదిరిగిన తానేటి వనిత
నా చావుకు ఎస్సై, వైకాపా నాయకులే కారణం
దళిత యువకుడు మహేంద్ర మరణ వాంగ్మూలం
ఈనాడు - రాజమహేంద్రవరం, న్యూస్టుడే - చాగల్లు: దళిత యువకుడు బొంతా మహేంద్ర (23) ఆత్మహత్యతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పరిహారం ఇవ్వడానికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనితను దొమ్మేరు ఎస్సీ పేట ప్రజలు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్ చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిలదీశారు. ‘‘ఎన్నికల్లో మీ విజయానికి కృషి చేస్తే... మాకు చావును బహుమానంగా ఇస్తారా? మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పినా పట్టించుకోని మీరు... ఇప్పుడు అతను చనిపోయాక ఎందుకొచ్చారు? మేం చెప్పగానే పోలీసుస్టేషన్కు ఫోన్ చేస్తే మహేంద్ర ప్రాణాలు పోయేవా?’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
మృతుడు మహేంద్ర కుటుంబసభ్యుల్ని పరామర్శించి, పరిహారం అందించేందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలిసి హోం మంత్రి వనిత బుధవారం సాయంత్రం దొమ్మేరుకు వెళ్లారు. నాగార్జున, వెంకట్రావులను బాధితుడి ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన దొమ్మేరు ఎస్సీ పేట యువత, మహిళలు.. వనిత వాహనాన్ని అడ్డుకున్నారు. ఆమెను రోడ్డుపైనే ఆపేశారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. ‘మా గ్రామంలోకి మీరొచ్చింది కాక మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులపైకి కుర్చీలు విసిరేశారు.
స్థానికుల ఆగ్రహాన్ని చూసి హోం మంత్రి రోడ్డుపైనే ఉండిపోగా.. పోలీసులు ఆమెకు రక్షణగా నిలిచారు. మరోవైపు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన నాగార్జున, వెంకట్రావు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, వైకాపా నాయకుడి తరఫున రూ.10 లక్షల చెక్కు అందించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వారు తిరిగొచ్చేవరకూ రోడ్డుపైనే ఉన్న హోం మంత్రి.. వారిద్వారా చర్చల సారాంశం తెలుసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
పోలీసుల గుప్పెట్లో దొమ్మేరు
మహేంద్ర ఆత్మహత్య నేపథ్యంలో దొమ్మేరు గ్రామంలోకి ఎవర్నీ రానీయకుండా వందల సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించారు. ఉదయం నుంచీ దొమ్మేరు మీదుగా వెళ్లే వాహనాలను అడ్డుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు దొమ్మేరు వెళ్లేందుకు సిద్ధమైన దళిత సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షకుమార్ను, కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ను, ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో తెదేపా అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్ను పోలీసులు గృహనిర్బంధం చేసి అడ్డుకున్నారు.
బలి తీసుకున్న వైకాపా ఆధిపత్య పోరు
వైకాపాలో ఆధిపత్య పోరు మహేంద్ర బలవన్మరణానికి కారణమైంది. దొమ్మేరులో ఈ నెల 6న జరిగిన ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి హోం మంత్రి వస్తున్నారంటూ వైకాపా నాయకులు నాగరాజు, సతీష్ ఫ్లెక్సీలు పెట్టారు. వారి ముఖాలున్న భాగాలు ఎవరో కత్తిరించటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై... మహేంద్రను పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి నిర్బంధించారు. అందుకే అతను ప్రాణాలు తీసుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు వాపోతున్నారు.
హోం మంత్రికి చెబితే.. ‘పంపించేస్తారు లే’ అన్నారు
‘కొవ్వూరు ఎస్సై భూషణం మా తమ్ముడిని పోలీసుస్టేషన్లో తీవ్రంగా హింసించారు. హోం మంత్రి తానేటి వనితకు ఫోన్ చేసి చెబితే ‘పంపించేస్తారు లే’ అంటూ తేలిగ్గా సమాధానమిచ్చారు. అవమానం భరించలేకే మహేంద్ర పురుగులమందు తాగాడు. తొలుత ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి చాగల్లుకు తరలించాం. తర్వాత రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ 45 నిమిషాలు చికిత్స అందించలేదు. అక్కడి నుంచి పోలీసులు విజయవాడ తరలిస్తుండగా మహేంద్ర చనిపోయాడు. అంబులెన్స్లో ఉన్న మహేంద్ర కుటుంబసభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారు. దీని వెనక రాజకీయ కుట్ర ఉంది’ అని మృతుడి సోదరుడు బొంతా రాజేష్ చెప్పారు. ‘నా సోదరుడిని పోలీసులు సజీవంగా తీసుకెళ్లి... మృతదేహాన్ని మూటకట్టి తీసుకొచ్చి అప్పగించారు. రేపు (నవంబరు 17న) మహేంద్ర పుట్టినరోజు, వాడే లేకుండా పోయాడు’ అని మరో సోదరుడు బొంతా రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
నా చావుకు ఎస్సై, వైకాపా నాయకులే కారణం
నా చావుకు కొవ్వూరు ఎస్సై భూషణం, వైకాపా నాయకులు ముదునూరి నాగరాజు, బల్లుల సతీష్ కారణం. వారిని చట్టపరంగా శిక్షించాలి. ఇదే నా మరణ వాంగ్మూలం. చేనులో పనిచేసుకుంటున్న నన్ను సీఐ రమ్మంటున్నారంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. సాయంత్రం వరకూ అక్కడ ఉంచేశారు. అసలు ఎందుకు స్టేషన్కు తీసుకెళ్లారో చెప్పలేదు. నన్ను చూసి ఎందుకొచ్చావని సీఐ ప్రశ్నించారు. చివరికి మా బంధువులు వచ్చాక విడిచిపెట్టారు.
చనిపోయే ముందు దళిత యువకుడు బొంతా మహేంద్ర వాంగ్మూలం
వైకాపా నాయకుల వల్లే ప్రాణాలు తీసుకున్నాడు
గత ఎన్నికల్లో వైకాపా విజయం కోసం కృషి చేసిన మహేంద్రను... ఆ పార్టీ నాయకుల వల్లే కోల్పోయాను. మంత్రి తానేటి వనితను మేమంతా కష్టపడి గెలిపిస్తే ఆమె కనీసం స్పందించలేదు. నేను జడ్పీటీసీ సభ్యురాలినైనా ప్రొటోకాల్ పాటించకుండా వివక్ష చూపుతున్నారు. నాకు గౌరవం లేకపోగా.. చివరికి నా కుమారుడిని కోల్పోయాను. కేసుతో సంబంధం లేకపోయినా మహేంద్రను స్టేషన్కు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో నేను హోం మంత్రితో కలిసి గడపగడప కూ కార్యక్రమంలో ఉన్నా. సమస్యను ఆమెకు వివరించినా మాకు న్యాయం జరగలేదు.
బొంతా వెంకటలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు, మహేంద్ర చిన్నమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ