అంగట్లో బోగస్ సర్టిఫికెట్లు
సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులుగా విధులు నిర్వర్తించేందుకు అవసరమైన నకిలీ ధ్రువపత్రాలు బహిరంగ మార్కెట్లో పెద్దఎత్తున లభ్యమవుతుండటం కలకలం రేపుతోంది.
పశుసంవర్ధకశాఖ సహాయకుల ఉద్యోగాలొస్తాయంటూ ఎర
గతంలోనూ ఫిర్యాదులు, ఆందోళనలు
నేతల అండదండలతో మళ్లీ అక్రమాలు?
ఈనాడు, కర్నూలు: సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులుగా విధులు నిర్వర్తించేందుకు అవసరమైన నకిలీ ధ్రువపత్రాలు బహిరంగ మార్కెట్లో పెద్దఎత్తున లభ్యమవుతుండటం కలకలం రేపుతోంది. సచివాలయాల పరిధిలో అందుబాటులో ఉన్న 1,896 పశుసంవర్ధశాఖ సహాయకుల పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన ఇవ్వనున్నట్లు ప్రచారంలో ఉండటంతో.. సంబంధిత పత్రాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 1,035 పోస్టులు ఉండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
రంగంలోకి పలు ముఠాలు
అర్హులైన పలువురు ఆయా పోస్టుల్ని సాధించేందుకు అవసరమైన శిక్షణ కోసం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేశారు. పశుసంవర్ధశాఖ సహాయకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో ఏళ్లుగా శ్రమిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఆ పోస్టులను అడ్డదారుల్లో దక్కించుకోవాలనుకునే వారికోసం కొన్ని ముఠాలు రంగంలోకి దిగాయి. అవసరమైన అర్హత ధ్రువపత్రాల పేరుతో నకిలీవి విక్రయిస్తూ అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి. కొందరు నేతల అండదండలతోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భారీగా వసూళ్లు
12 రకాల కోర్సుల్లో ఏది పూర్తి చేసినా వారిని అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్.వి.వి.యు.) నుంచి పశుసంవర్ధక విభాగంలో పాలిటెక్నిక్, పాడి పరిశ్రమ/ పౌల్ట్రీసైన్స్ పాఠ్యాంశాలతో ఇంటర్ వృత్తి విద్యా కోర్సు, రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా/ రెండేళ్ల ఇంటర్ ఎం.పి.వి.ఎ. (మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్), ఇంటర్ (ఎ.పి.ఒ.ఎస్.ఎస్.), ‘పాడి పరిశ్రమ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్’ అందించే ఇంటర్ వృత్తి విద్యా కోర్సు, బీఎస్సీ (డెయిరీ సైన్స్), ఎమ్మెస్సీ (డెయిరీ సైన్స్), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), డెయిరీ ప్రాసెసింగ్ డిప్లొమా, భారత్ సేవక్ సమాజ్ అందించే వెటర్నరీ సైన్స్ డిప్లొమా తదితర అర్హతలను ఉద్యోగ ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆయా కోర్సులకు సంబంధించిన అర్హతగల ధ్రువపత్రాలు ఇచ్చినందుకు ఒక్కో అభ్యర్థి నుంచి వారి స్తోమతను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు సమాచారం.
భారత్ సేవక్ సమాజ్కు గుర్తింపుతో వివాదం
భారత్ సేవక్ సమాజ్ పేరుతో జారీ చేస్తున్న ధ్రువపత్రాలు బోగస్వని కొన్ని విద్యార్థి సంఘాలు గతంలో ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పేరుతో ఉన్న అర్హత పత్రాలతో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కొలువులు ఇవ్వకుండా ప్రభుత్వం ఆపేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో వారికి మళ్లీ ఉద్యోగాలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం వారు కోర్సుల్ని పూర్తిచేశారా.. లేదా అన్న దానిపై తదుపరి దర్యాప్తు చేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ ఈసారీ ‘భారత్ సేవక్ సమాజ్’ వెటర్నరీ సైన్స్ కోర్సును గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం విశేషం.
బోగస్ ధ్రువపత్రాలపై దర్యాప్తు జరగాలి
ఎంపికైన అభ్యర్థులు సమర్పిస్తున్న ధ్రువపత్రాలు నిజమైనవా.. కావా.. అన్న అంశంపై ఎలాంటి విచారణ జరగడంలేదు. ఫలితంగా బోగస్ అర్హత పత్రాలు సమర్పించిన వాళ్లు దర్జాగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనిపై గతంలో ఆందోళనలు చేశాం. అయినా పట్టించుకోలేదు. తాజాగా మళ్లీ బోగస్ ధ్రువపత్రాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
నగేశ్, డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి, కర్నూలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్