Polavaram: ‘పదండి దూసుకు..’ పదండి వెనక్కి!
పోలవరం... ఆంధ్రప్రదేశ్కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం.
రివర్స్గేర్లో జీవనాడి పోలవరం పనులు
జగన్ మోహన్రెడ్డి నిర్ణయాలతో అంతా మొదటికి
ఆంధ్రావని ప్రయోజనాలకంటే అస్మదీయులకే పెద్దపీట
కేంద్రం హెచ్చరించినా పట్టించుకోని వైకాపా సర్కారు
ఈనాడు - అమరావతి
బండి ముందుకు నడవాలంటే మొదటి గేర్లో మొదలై క్రమంగా గేర్లు మార్చుతూ సాగాలన్నది ఇంగితజ్ఞానం!
కానీ, అలా కాకుండా రివర్స్గేర్ వేసి బండి ముందుకు పోవట్లేదని మొత్తుకుంటే..?
ఆ బుద్ధినేమనాలి? అలాంటి వారినేమని పిలవాలి?
జగనన్న హయాంలో ఆంధ్రావని జీవనాడి పోలవరం నిర్మాణం అచ్చంగా ఇదే తరహాలో రివర్స్గేర్లో సాగుతోంది!
ఆకలితో నకనకలాడుతున్న వాడి నోటికాడికొచ్చిన ముద్దను లాక్కొని... మరింత రుచికరకంగా వండుతాను ఆగు... అని అంటే ఎలా ఉంటుందో పోలవరం విషయంలో జగన్ సర్కారు ధోరణి అలాగే ఉంది.
చంద్రబాబు హయాంలో అంతా పూర్తయి... మరో రెండు పనులు చేస్తేచాలు ఆంధ్రుల తరతరాల కల నిజమవుతుందనుకుంటున్న దశలో... జగన్ ప్రభుత్వం వచ్చింది. రివర్స్ టెండరింగ్ అంటూ అస్మదీయులకు పనులను కట్టబెట్టేందుకు పోలవరానికి రివర్స్గేర్ వేసింది.
కేంద్రం వద్దన్నా... నిపుణులు వలదన్నా.. వినలేదు జగనన్న. ఫలితం కాలయాపనలో అప్పటిదాకా కట్టిన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. మాట మార్చటం... మడమతిప్పటం మా ఇంటావంటా లేదంటూ... ఫలానా నెలలో ప్రారంభోత్సవం అని ప్రకటించిన జగన్ ఇప్పుడు వెన్నుచూపి చేతులెత్తేశారు!
పోలవరం(Polavaram)... ఆంధ్రప్రదేశ్కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం. రెండంటే రెండే అడుగులు... ఒకటి కాఫర్ డ్యాం గ్యాప్లు పూడ్చటం, మరోటి స్పిల్ వేలో మిగిలిన సగభాగం పూర్తి చేయడం.. ఆ తర్వాత ప్రధాన డ్యాం నిర్మిస్తే చాలు... చరిత్రలో నిలిచిపోయేది. ఆంధ్రావని దశ మారిపోయేది! అలా... ప్రాజెక్టు నిర్మాణం దాదాపు కొలిక్కి వస్తుందనగా ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉంటే... అప్పటికి నాలుగేళ్లుగా వేగంగా సాగుతున్న ప్రాజెక్టు పనుల పరుగును అందిపుచ్చుకొని ఉంటే.. ప్రణాళిక మేరకు పూర్తి చేసి ఉంటే... ముఖ్యమంత్రి కుర్చీలో ఏ రాజనీతిజ్ఞుడో, పాలనాదక్షుడో కూర్చొని ఉంటే... పోలవరం కల ఇప్పటికల్లా సాకారం అయ్యుండేది.
కానీ తెలుగు ప్రజల దురదృష్టం కొద్దీ 2019లో సీఎం పగ్గాలు చేపట్టిన జగనన్న.. ఆంధ్రావని ప్రయోజనాలను పక్కకుతోసి.. అస్మదీయ గుత్తేదారులకు పెద్దపీట వేశారు. ఖజానాపై భారం తగ్గిస్తున్నామన్న ముసుగులో రివర్స్ టెండరింగ్ పేరిట కావల్సినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టి, ప్రాజెక్టు పనులను పూర్తిగా అటకెక్కించేశారు. జగన్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం కూడా పదేపదే హెచ్చరించినా వినలేదు. కేంద్ర నిపుణుల కమిటీ కూడా పోలవరం ప్రాజెక్టులో అనిశ్చితికి, డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి, ప్రధాన డ్యాం ప్రాంతంలో అగాధాలు ఏర్పడటానికి కారణం మానవ వైఫల్యమే (ఆ సమయంలో ముఖ్యమంత్రి జగనే) అని తేల్చి చెప్పింది!! ప్రాజెక్టు నత్తనడకపై ఇటీవలే కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది కూడా!
చెప్పినా.. చెవికెక్కలేదు..
1
వేగంగా సాగుతున్న పోలవరం పనులను జగన్ అర్ధంతరంగా ఆపేశారు. రివర్స్ టెండర్ల పేరుతో దాన్నో ప్రహసనంలా మార్చారు. ప్రాజెక్టు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం ఏంటంటూ కేంద్రమూ హెచ్చరించింది. వివరణ కోరినా.. వైకాపా సర్కారు పట్టించుకోలేదు. మొండిగా రివర్స్ టెండర్లు నిర్వహించింది. కేవలం జగన్కు కావాల్సిన గుత్తేదారు సంస్థ మేఘా ఒక్కటే టెండరు దాఖలు చేసింది. వారికే పనులు ఇచ్చేసింది. చివరికి కేంద్రం చెప్పినట్లే ప్రాజెక్టు పురోగతి పడకేసింది.
2
2019 నవంబరులో మేఘాతో ఒప్పందం కుదుర్చుకుంటే, 2021 జనవరి వరకు ఆ సంస్థ చేసిన పని స్వల్పమే. విలువైన సమయాన్ని వృథా చేశారు. ఎగువ కాఫర్డ్యాం గ్యాప్లు పూడ్చలేదు. దిగువ కాఫర్డ్యాంనూ నిర్మించలేదు. ఫలితంగా 2020 భారీ వరదలకు పోలవరంలో కీలక నిర్మాణమైన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట... భారీ గోతులు ఏర్పడి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దిగువ కాఫర్డ్యాంలోనూ నష్టం జరగడంతో పనులు నిలిచిపోయాయి.
కేంద్రం ఆదేశాలతో పోలవరం సమస్యపై హైదరాబాద్ ఐఐటీ నిపుణుల కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందించింది. ‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటానికి, నదీ గర్భం కోతకు గురికావడానికి ప్రకృతి ప్రకోపం కారణం కాదు. ఇది పూర్తిగా మానవ వైఫల్యమే. సకాలంలో ఎగువ కాఫర్డ్యాంలో గ్యాప్లను పూడ్చలేని అసమర్థతే ఈ ఉత్పాతానికి కారణం’ అని తేల్చిచెప్పింది. సకాలంలో ఎగువ కాఫర్డ్యాం గ్యాప్లను పూడ్చనిది జగన్ ప్రభుత్వమే.
3
పోలవరంలో స్పిల్ వేకు ఇబ్బంది కలగకుండా గైడ్బండ్ నిర్మించారు. అది కూడా కుంగిపోయింది. దాన్ని పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యత లేని నిర్మాణం, ఆకృతులకు తగినట్లుగా నిర్మించకపోవడమే అందుకు కారణమని కేంద్ర కమిటీ తేల్చి చెప్పింది. అదే తరహాలో చేపట్టిన గ్యాప్-1 ప్రధాన డ్యాం నిర్మాణ నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదీ జగన్ ప్రభుత్వ హయాంలోనే!
4
ఎగువ, దిగువ కాఫర్డ్యాంల నిర్మాణం పూర్తి చేశారు. అవి సక్రమంగా ఉంటే... ప్రధానడ్యాం నిర్మించనున్న వైపు వరద రాకూడదు. వాటి సీపేజీ అంచనాలకు మించడంతో ప్రధానడ్యాం ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. సీపేజీపై తాము ముందే హెచ్చరించినా, రాష్ట్రం పట్టించుకోలేదని కేంద్ర నిపుణులు తప్పు బట్టారు.
అది 2019, జూన్ 20న...
(తొలిసారి సీఎం హోదాలో జగన్ పోలవరం సందర్శన.. అక్కడే సమీక్ష)
‘ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి చేయగలరో గడువు మీరే చెప్పండి’ అంటూ ఇంజినీరింగ్ అధికారులను అడిగిన సీఎం జగన్ వెంటనే... ‘ఒకటి, రెండు నెలలు ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదు. కచ్చితంగా చెప్పండి’ అన్నారు. ‘2020 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలం’ అని సంబంధిత అధికారులు జవాబిచ్చారు. అంటే..చంద్రబాబునాయుడు హయాంలో 2019 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పనులు సింహభాగం పూర్తయ్యాయని, మరో ఏడాదిలో మిగతావీ అయిపోతాయని సాక్షాత్తు ఇంజినీరింగ్ అధికారులు చెప్పకనే చెప్పేశారు. ఆ రోజు వరకు పోలవరం పూర్తి చేసేందుకు ఎటువంటి సవాళ్లు లేవని అంగీకరించారు. అధికారుల స్పందన వినగానే... వెంటనే ముఖ్యమంత్రి జగన్... ఉత్సాహంగా ‘2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్లు అందిస్తాం’ అని అక్కడిక్కడే అధికారికంగా ప్రకటించారు.
2023.. ఆగస్టు 7న...
గోదావరి వరదల్లో చిక్కుకున్న నిర్వాసిత గ్రామాల్లో జగన్ పర్యటించారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో వారికి ప్రభుత్వం ఎలాంటి పునరావాసమూ కల్పించలేదు. అక్కడ మాట్లాడుతూ... 2025 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లందిస్తామని ప్రకటించారు. అంటే ఏడాదిన్నరలో పూర్తి చేసెయ్యగల ప్రాజెక్టును, తన హయాంలో ఐదేళ్లయినా అందుబాటులోకి తీసుకురాలేకపోయానని జగన్ పరోక్షంగా అంగీకరించారు.
ఇప్పుడు అన్నీ సవాళ్లే...
ప్రస్తుతం పోలవరంలో అన్నీ సవాళ్లే. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ సమస్యను పరిష్కరించుకోవాలి.
కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం మళ్లీ మొదటికొచ్చింది.
గైడ్బండ్ మళ్లీ నిర్మించుకోవాలి. గ్యాప్-1 డ్యాం నాణ్యతను నిర్ధారించుకోవాలి.
అనేక సాంకేతిక అంశాలకు ఇంకా పరిష్కారం గుర్తించాలి.
అవును.. గత ప్రభుత్వ హయాంలోనే వేగంగా పనులు (అంకెలన్నీ రూ.కోట్లలో)
పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడు ఎంత విలువైన పని జరిగిందో ఈ ఏడాది జనవరిలో జల వనరుల శాఖ అధికారులు లెక్కలు కట్టారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో అధికారులు తేల్చిన లెక్కలే ఇవి. వాటి ప్రకారం చంద్రబాబు హయాంలోనే ప్రాజెక్టు పనులు వేగంగా జరిగినట్లు, ఎక్కువ వ్యయం చేసినట్లు తేల్చారు. 2023 జనవరి నాటికి జరిగిన పని ప్రకారం కట్టిన లెక్కలు ఇవీ...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!