Polavaram: ‘పదండి దూసుకు..’ పదండి వెనక్కి!
పోలవరం... ఆంధ్రప్రదేశ్కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం.
రివర్స్గేర్లో జీవనాడి పోలవరం పనులు
జగన్ మోహన్రెడ్డి నిర్ణయాలతో అంతా మొదటికి
ఆంధ్రావని ప్రయోజనాలకంటే అస్మదీయులకే పెద్దపీట
కేంద్రం హెచ్చరించినా పట్టించుకోని వైకాపా సర్కారు
ఈనాడు - అమరావతి
బండి ముందుకు నడవాలంటే మొదటి గేర్లో మొదలై క్రమంగా గేర్లు మార్చుతూ సాగాలన్నది ఇంగితజ్ఞానం!
కానీ, అలా కాకుండా రివర్స్గేర్ వేసి బండి ముందుకు పోవట్లేదని మొత్తుకుంటే..?
ఆ బుద్ధినేమనాలి? అలాంటి వారినేమని పిలవాలి?
జగనన్న హయాంలో ఆంధ్రావని జీవనాడి పోలవరం నిర్మాణం అచ్చంగా ఇదే తరహాలో రివర్స్గేర్లో సాగుతోంది!
ఆకలితో నకనకలాడుతున్న వాడి నోటికాడికొచ్చిన ముద్దను లాక్కొని... మరింత రుచికరకంగా వండుతాను ఆగు... అని అంటే ఎలా ఉంటుందో పోలవరం విషయంలో జగన్ సర్కారు ధోరణి అలాగే ఉంది.
చంద్రబాబు హయాంలో అంతా పూర్తయి... మరో రెండు పనులు చేస్తేచాలు ఆంధ్రుల తరతరాల కల నిజమవుతుందనుకుంటున్న దశలో... జగన్ ప్రభుత్వం వచ్చింది. రివర్స్ టెండరింగ్ అంటూ అస్మదీయులకు పనులను కట్టబెట్టేందుకు పోలవరానికి రివర్స్గేర్ వేసింది.
కేంద్రం వద్దన్నా... నిపుణులు వలదన్నా.. వినలేదు జగనన్న. ఫలితం కాలయాపనలో అప్పటిదాకా కట్టిన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. మాట మార్చటం... మడమతిప్పటం మా ఇంటావంటా లేదంటూ... ఫలానా నెలలో ప్రారంభోత్సవం అని ప్రకటించిన జగన్ ఇప్పుడు వెన్నుచూపి చేతులెత్తేశారు!
పోలవరం(Polavaram)... ఆంధ్రప్రదేశ్కు నిజంగా జలవరం! రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి ఇది. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం. రెండంటే రెండే అడుగులు... ఒకటి కాఫర్ డ్యాం గ్యాప్లు పూడ్చటం, మరోటి స్పిల్ వేలో మిగిలిన సగభాగం పూర్తి చేయడం.. ఆ తర్వాత ప్రధాన డ్యాం నిర్మిస్తే చాలు... చరిత్రలో నిలిచిపోయేది. ఆంధ్రావని దశ మారిపోయేది! అలా... ప్రాజెక్టు నిర్మాణం దాదాపు కొలిక్కి వస్తుందనగా ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉంటే... అప్పటికి నాలుగేళ్లుగా వేగంగా సాగుతున్న ప్రాజెక్టు పనుల పరుగును అందిపుచ్చుకొని ఉంటే.. ప్రణాళిక మేరకు పూర్తి చేసి ఉంటే... ముఖ్యమంత్రి కుర్చీలో ఏ రాజనీతిజ్ఞుడో, పాలనాదక్షుడో కూర్చొని ఉంటే... పోలవరం కల ఇప్పటికల్లా సాకారం అయ్యుండేది.
కానీ తెలుగు ప్రజల దురదృష్టం కొద్దీ 2019లో సీఎం పగ్గాలు చేపట్టిన జగనన్న.. ఆంధ్రావని ప్రయోజనాలను పక్కకుతోసి.. అస్మదీయ గుత్తేదారులకు పెద్దపీట వేశారు. ఖజానాపై భారం తగ్గిస్తున్నామన్న ముసుగులో రివర్స్ టెండరింగ్ పేరిట కావల్సినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టి, ప్రాజెక్టు పనులను పూర్తిగా అటకెక్కించేశారు. జగన్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వం కూడా పదేపదే హెచ్చరించినా వినలేదు. కేంద్ర నిపుణుల కమిటీ కూడా పోలవరం ప్రాజెక్టులో అనిశ్చితికి, డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి, ప్రధాన డ్యాం ప్రాంతంలో అగాధాలు ఏర్పడటానికి కారణం మానవ వైఫల్యమే (ఆ సమయంలో ముఖ్యమంత్రి జగనే) అని తేల్చి చెప్పింది!! ప్రాజెక్టు నత్తనడకపై ఇటీవలే కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది కూడా!
చెప్పినా.. చెవికెక్కలేదు..
1
వేగంగా సాగుతున్న పోలవరం పనులను జగన్ అర్ధంతరంగా ఆపేశారు. రివర్స్ టెండర్ల పేరుతో దాన్నో ప్రహసనంలా మార్చారు. ప్రాజెక్టు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం ఏంటంటూ కేంద్రమూ హెచ్చరించింది. వివరణ కోరినా.. వైకాపా సర్కారు పట్టించుకోలేదు. మొండిగా రివర్స్ టెండర్లు నిర్వహించింది. కేవలం జగన్కు కావాల్సిన గుత్తేదారు సంస్థ మేఘా ఒక్కటే టెండరు దాఖలు చేసింది. వారికే పనులు ఇచ్చేసింది. చివరికి కేంద్రం చెప్పినట్లే ప్రాజెక్టు పురోగతి పడకేసింది.
2
2019 నవంబరులో మేఘాతో ఒప్పందం కుదుర్చుకుంటే, 2021 జనవరి వరకు ఆ సంస్థ చేసిన పని స్వల్పమే. విలువైన సమయాన్ని వృథా చేశారు. ఎగువ కాఫర్డ్యాం గ్యాప్లు పూడ్చలేదు. దిగువ కాఫర్డ్యాంనూ నిర్మించలేదు. ఫలితంగా 2020 భారీ వరదలకు పోలవరంలో కీలక నిర్మాణమైన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట... భారీ గోతులు ఏర్పడి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దిగువ కాఫర్డ్యాంలోనూ నష్టం జరగడంతో పనులు నిలిచిపోయాయి.
కేంద్రం ఆదేశాలతో పోలవరం సమస్యపై హైదరాబాద్ ఐఐటీ నిపుణుల కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందించింది. ‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటానికి, నదీ గర్భం కోతకు గురికావడానికి ప్రకృతి ప్రకోపం కారణం కాదు. ఇది పూర్తిగా మానవ వైఫల్యమే. సకాలంలో ఎగువ కాఫర్డ్యాంలో గ్యాప్లను పూడ్చలేని అసమర్థతే ఈ ఉత్పాతానికి కారణం’ అని తేల్చిచెప్పింది. సకాలంలో ఎగువ కాఫర్డ్యాం గ్యాప్లను పూడ్చనిది జగన్ ప్రభుత్వమే.
3
పోలవరంలో స్పిల్ వేకు ఇబ్బంది కలగకుండా గైడ్బండ్ నిర్మించారు. అది కూడా కుంగిపోయింది. దాన్ని పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యత లేని నిర్మాణం, ఆకృతులకు తగినట్లుగా నిర్మించకపోవడమే అందుకు కారణమని కేంద్ర కమిటీ తేల్చి చెప్పింది. అదే తరహాలో చేపట్టిన గ్యాప్-1 ప్రధాన డ్యాం నిర్మాణ నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదీ జగన్ ప్రభుత్వ హయాంలోనే!
4
ఎగువ, దిగువ కాఫర్డ్యాంల నిర్మాణం పూర్తి చేశారు. అవి సక్రమంగా ఉంటే... ప్రధానడ్యాం నిర్మించనున్న వైపు వరద రాకూడదు. వాటి సీపేజీ అంచనాలకు మించడంతో ప్రధానడ్యాం ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. సీపేజీపై తాము ముందే హెచ్చరించినా, రాష్ట్రం పట్టించుకోలేదని కేంద్ర నిపుణులు తప్పు బట్టారు.
అది 2019, జూన్ 20న...
(తొలిసారి సీఎం హోదాలో జగన్ పోలవరం సందర్శన.. అక్కడే సమీక్ష)
‘ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి చేయగలరో గడువు మీరే చెప్పండి’ అంటూ ఇంజినీరింగ్ అధికారులను అడిగిన సీఎం జగన్ వెంటనే... ‘ఒకటి, రెండు నెలలు ఎక్కువ సమయం తీసుకున్నా పర్వాలేదు. కచ్చితంగా చెప్పండి’ అన్నారు. ‘2020 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలం’ అని సంబంధిత అధికారులు జవాబిచ్చారు. అంటే..చంద్రబాబునాయుడు హయాంలో 2019 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పనులు సింహభాగం పూర్తయ్యాయని, మరో ఏడాదిలో మిగతావీ అయిపోతాయని సాక్షాత్తు ఇంజినీరింగ్ అధికారులు చెప్పకనే చెప్పేశారు. ఆ రోజు వరకు పోలవరం పూర్తి చేసేందుకు ఎటువంటి సవాళ్లు లేవని అంగీకరించారు. అధికారుల స్పందన వినగానే... వెంటనే ముఖ్యమంత్రి జగన్... ఉత్సాహంగా ‘2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్లు అందిస్తాం’ అని అక్కడిక్కడే అధికారికంగా ప్రకటించారు.
2023.. ఆగస్టు 7న...
గోదావరి వరదల్లో చిక్కుకున్న నిర్వాసిత గ్రామాల్లో జగన్ పర్యటించారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో వారికి ప్రభుత్వం ఎలాంటి పునరావాసమూ కల్పించలేదు. అక్కడ మాట్లాడుతూ... 2025 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లందిస్తామని ప్రకటించారు. అంటే ఏడాదిన్నరలో పూర్తి చేసెయ్యగల ప్రాజెక్టును, తన హయాంలో ఐదేళ్లయినా అందుబాటులోకి తీసుకురాలేకపోయానని జగన్ పరోక్షంగా అంగీకరించారు.
ఇప్పుడు అన్నీ సవాళ్లే...
ప్రస్తుతం పోలవరంలో అన్నీ సవాళ్లే. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ సమస్యను పరిష్కరించుకోవాలి.
కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం మళ్లీ మొదటికొచ్చింది.
గైడ్బండ్ మళ్లీ నిర్మించుకోవాలి. గ్యాప్-1 డ్యాం నాణ్యతను నిర్ధారించుకోవాలి.
అనేక సాంకేతిక అంశాలకు ఇంకా పరిష్కారం గుర్తించాలి.
అవును.. గత ప్రభుత్వ హయాంలోనే వేగంగా పనులు (అంకెలన్నీ రూ.కోట్లలో)
పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడు ఎంత విలువైన పని జరిగిందో ఈ ఏడాది జనవరిలో జల వనరుల శాఖ అధికారులు లెక్కలు కట్టారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో అధికారులు తేల్చిన లెక్కలే ఇవి. వాటి ప్రకారం చంద్రబాబు హయాంలోనే ప్రాజెక్టు పనులు వేగంగా జరిగినట్లు, ఎక్కువ వ్యయం చేసినట్లు తేల్చారు. 2023 జనవరి నాటికి జరిగిన పని ప్రకారం కట్టిన లెక్కలు ఇవీ...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!